
2024లో ప్రభాస్ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది..? ఒప్పుకున్న సినిమాల్లో ముందు దేన్ని పూర్తి చేయబోతున్నారు..? సలార్ 2 రేసులో ముందుకొస్తుందా లేదంటే నాగ్ అశ్విన్ సినిమాకు డేట్స్ ఇచ్చేస్తారా..? ఎప్పట్నుంచో లైన్లో ఉన్న మారుతి సినిమాను ఖతమ్ చేస్తారా..?

అదీ కాదంటే స్పిరిట్ అంటూ సందీప్ను రేసులోకి తెస్తారా..? అసలు ప్రభాస్ ప్లాన్ ఏంటి..?చాలా కాలం తర్వాత ప్రభాస్ అభిమానులు హ్యాపీగా ఉన్నారు. దానికి కారణం సలార్.. దానికి వస్తున్న వసూళ్లు. విడుదలైన 11వ రోజు కూడా ఏపీ తెలంగాణలో 8.30 కోట్ల షేర్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించింది సలార్.

తెలుగు రాష్ట్రాల్లోనే 145 కోట్ల షేర్.. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం. నైజాంలో ట్రిపుల్ ఆర్ 109 కోట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉంటే.. 69 కోట్లతో సలార్ రెండో స్థానంలో ఉంది. హిందీలోనూ 150 కోట్ల క్లబ్బులో చేరిపోయింది సలార్. ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం.

ఇదిలా ఉంటే సలార్ తర్వాత ప్రభాస్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ కల్కితో పాటు మారుతి, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్, హను రాఘవపూడి సినిమాలకు కమిటయ్యారు. వీటితో పాటే సలార్ 2 కూడా లైన్లో ఉంది.

ప్రభాస్ ప్లాన్ ఏంటనేది ఇప్పుడు అర్థం కావట్లేదు. ప్రాజెక్ట్ కే షూటింగ్ ఎలాగూ సగం అయిపోయింది కాబట్టి ముందు దీన్ని పూర్తి చేయాలని చూస్తున్నారు రెబల్ స్టార్. అలాగే మారుతి సినిమాను సైతం 2024 ఫస్టాఫ్లోనే పూర్తి చేయాలనేది ప్రభాస్ ఆలోచన.

ఈ రెండూ అయిపోతే.. తీరిగ్గా స్పిరిట్తో పాటు సలార్ 2పై ఫోకస్ చేయొచ్చనేది ప్రభాస్ ఆలోచనగా కనిపిస్తుంది. సలార్ రేంజ్ చూసాక.. అదే వేడిలో పార్ట్ 2 త్వరగా పూర్తి చేయాలనుకుంటే మాత్రం సందీప్ వంగాకు వెయిటింగ్ తప్పదు.

అయినా ఈయన స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి మరో ఆర్నెళ్లు పడుతుంది. ఈ గ్యాప్లో ప్రాజెక్ట్ కే, మారుతి సినిమాలు పూర్తి చేయనున్నారు ప్రభాస్. ఆ తర్వాత సలార్ 2 శౌర్యంగ పర్వం సెట్స్పైకి రావచ్చు. ఎలా చూసుకున్నా.. 2024లో ప్రభాస్కు కన్ఫ్యూజన్స్ అయితే తప్పవు.