
హైదరాబాద్లో చేసిన షూటింగ్ తరువాత నెక్ట్స్ షెడ్యూల్ కెన్యా ఫారెస్ట్లో ప్లాన్ చేశారు రాజమౌళి. అయితే అక్కడి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో షూటింగ్ వాయిదా పడింది. దీంతో డైలమాలో పడ్డ ఎస్ఎస్ఎంబీ 29 యూనిట్, వెంటనే తేరుకొని ఆల్టర్నేట్ లొకేషన్ను సెట్ చేసింది. వచ్చే వారం నుంచి మరో బిగ్ షెడ్యూల్కు ప్లాన్ రెడీ చేసింది.

కెన్యాలో క్యాన్సిల్ అయిన షెడ్యూల్ను టాంజానియాలో షూట్ చేయబోతున్నారు రాజమౌళి. ఈ షెడ్యూల్లో మహేష్ బాబుతో పాటు పృథ్వీరాజ్ సుకుమార్, ప్రియాంక చోప్రా కూడా పాల్గొంటారు.

యాక్షన్ ఎపిసోడ్స్తో పాటు కొంత టాకీని కూడా పూర్తి చేసేలా ఈ షెడ్యూల్ను ప్లాన్ చేశారు.టాంజానియా షెడ్యూల్ పూర్తయిన వెంటనే అటు నుంచి అటే సౌత్ ఆఫ్రికా వెళ్లనుంది ఎస్ఎస్ఎంబీ 29 యూనిట్.

అక్కడి థిక్ ఫారెస్ట్లో మరికొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారు రాజమౌళి. ఈ రెండు షెడ్యూల్స్లోనే ఫారెస్ట్ ఎపిసోడ్కు సంబంధించి మేజర్ వర్క్ ఫినిష్ అవుతుంది. నెక్ట్స్ హైదరాబాద్లో వేస్తున్న వారణాసి సెట్లో మరో మేజర్ షెడ్యూల్ షూటింగ్ చేస్తారు.

ఇలా వరుస షెడ్యూల్స్తో వీలైనంత త్వరగా షూటింగ్ పార్ట్ పూర్తి చేసేలా ప్లాన్ చేశారు రాజమౌళి. ఆ తరువాత పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ మీద ఫోకస్ చేస్తారు. అవుట్పుట్ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చిన తరువాతే రిలీజ్ డేట్ గురించి నిర్ణయం తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు జక్కన్న.