
తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన లెటేస్ట్ చిత్రం జైభీమ్.

తాజాగా జైభీమ్ చిత్రం చైనాలోనూ విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. చైనాకు చెందిన ప్రముఖ మీడియా సమీక్ష ప్లాట్ఫామ్ అయిన డౌబన్లో 8.7 రేటింగ్ను దక్కించుకొని చైనీయులను సైతం విపరీతంగా ఆకట్టుకుంది.

ఇందులో సూర్య లాయర్ పాత్రలో అదరగొట్టగా.. సినతల్లి పాత్రలో లిజోమోల్ జోస్ జీవించింది. ఈ సినిమాలోని ప్రతి ఒక్కరి నటనకు ప్రేక్షకులు ఫిదా అవ్వగా..

సినీ, రాజకీయ ప్రముఖులు జైభీమ్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ సినిమాను జస్టిస్ చంద్రు జీవితం ఆధారంగా తెరెక్కించిన ఈ మూవీ ఎక్కువగానే కోర్టులోనే సాగుతుంది.

ఇక ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫాంలో సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది.

తాజాగా ఈ సినిమా కోర్టుకు సీన్లకు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది.

ఈ మూవీ కోసం మద్రాసు హైకోర్టును రీక్రియేట్ చేసింది చిత్రయూనిట్.

కేవలం 25 రోజుల్లో తీర్చిదిద్దిన సెట్ చూసి, గత కొన్నేళ్లుగా మాద్రాసు హైకోర్టులో పనిచేస్తున్న హైకోర్టు సిబ్బంది.. న్యాయవాదులు సైతం ఆశ్చర్యపోయారు.

1995 నాటి కోర్టు వాతావరణాన్ని తెరపై చూపించడానికి ప్రొడక్షన్ డిజైనర్ కె.కదిర్, సినిమాట్రోగ్రాఫర్ ఎస్.ఆర్.కదిర్ లు ఎంతో కృషి చేశారట.

అంతేకాకుండా.. డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తన ఊహలకు ప్రాణం పోశారు.

సెట్ వేసే సమయంలో జస్టిస్ చంద్రు కూడా సెట్ దగ్గరకు వచ్చి సలహాలు ఇవ్వడం గమనార్హం.

మొత్తానికి సూర్య.. లిజోమోల్ కీలక పాత్రలలో నటించిన జైభీమ్ సినిమా హిట్ టాక్తో విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ దూసుకుపోతుంది.