19 ఏప్రిల్ 1990 తెలంగాణలోని చారిత్రాత్మక నగరం వరంగల్ లో ఓ తెలుగు హిందూ కుటుంబంలో జన్మించింది అందాల భామ ఈషా రెబ్బ. ఈమె పెరిగింది మాత్రం హైదరాబాద్ నగరంలోనే. ఈ వయ్యారి వరంగల్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో పాఠశాల విద్యను అభ్యసించింది. మాస్టర్స్ అఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA)లో డిగ్రీ పట్టా పొందింది.
2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో తెరంగేట్రం చేసింది. అయితే హీరోయిన్ గా కెరీర్ మొదలైంది మాత్రం ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శత్వంలో వచ్చిన అంతక ముందు సినిమాతో.. ఇందులో సుమంత్ అశ్విన్ హీరో.
తర్వాత రొమాంటిక్-కామెడీ చిత్రం అమీ తుమీలో కథానాయకిగా మెప్పించింది. ఇందులో ఆమె నటనకు విస్తృత స్పందన లభించింది. మూడు అవార్డులు కూడా లభించాయి. మాయా మాల్, దర్శకుడు, ఆ, బ్రాండ్ బాబు వంటి చిత్రాల్లో నటించింది.
తర్వాత ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అరవింద సామెత వీర రాఘవ నుంచి సెకండ్ హీరోయిన్ గా మారింది ఈ వయ్యారి. తర్వాత కొన్ని చిత్రం కూడా సెకండ్ హీరోయిన్గా నటించి మెప్పించింది ఈ వయ్యారి భామ.
2023 లో మామా మశ్చీంద్రలో మరోసారి కథానాయకిగా కనిపించింది. 3 రోజెస్, పిట్టా కథలు, మాయ బజార్ ఫర్ సేల్, దయ వంటి వెబ్ సిరీస్ ల్లో కూడా నటించింది. ప్రస్తుతం 3 రోజెస్ సీజన్ 2లో నటిస్తుంది.