
సినిమా వాళ్లకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం పదుల సంఖ్యలో వైరల్ అవుతూ ఉంటాయి. సినీ సెలబ్రెటీలకు సంబందించిన ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తూ ఉంటారు. చాలామంది తమ అభిమాన హీరోల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. పై ఫొటోలో ఉన్న నటి ఓ చైల్డ్ ఆర్టిస్ట్ ను గుర్తుపట్టారా.?

ఒకప్పుడు చిరంజీవి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి.. అతర్వాత చిరుకు చెల్లెలిగా కనిపించింది ఓ హీరోయిన్. పైన ఫోటోను చూశారు కదా.. ? ఆ ఫోటో పసివాడి ప్రాణం సినిమాలోనిది. చిరంజీవి కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్ మూవీ పసివాడి ప్రాణం. ఈ సినిమాలోచైల్డ్ ఆర్టిస్టుగా నటించిన కుర్రాడు గుర్తున్నాడా.. ? అమాయకత్వంతో అప్పట్లో జనాలను ఆకట్టుకున్నాడు. కానీ అతడు అబ్బాయి కాదు.. అమ్మాయి.

మెగాస్టార్ చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం సినిమాలో కనిపించిన ఆ చైల్డ్ ఆర్టిస్ట్ మరెవరో కాదండి.. బుల్లితెర ఫేమస్ హీరోయన్ సుజిత. చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించింది. ఆ తర్వాత సినిమాల్లో కీలకపాత్రలు పోషించింది. ముఖ్యంగా బుల్లితెరపై ఆమె సూపర్ హీరోయిన్. తెలుగు, తమిళం భాషలోల అనేక చిత్రాల్లో నటించింది. ఇప్పటికీ సీరియల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూనే ఉంది.

తెలుగులో సుందరకాండ, వదినమ్మ సీరియల్స్ ద్వారా ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ఆమె తమిళంలో పలు సీరియల్స్ చేస్తుంది. అలాగే షాలకు యాంకరింగ్ చేస్తుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళ టీవీ సీరియల్స్లో నటిస్తోన్న నటి సుజితా ధనుష్. అప్పట్లో చిరంజీవితో కలిసి పసివాడి ప్రాణంలో ఛైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన సుజిత, ఆతర్వాత జై చిరంజీవలో అదే మెగాస్టార్కు చెల్లెలిగా నటించడం విశేషం.

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుజిత.. తనకు పసివాడి ప్రాణం తర్వాత మరో ఐదారు చిత్రాల్లోనూ అబ్బాయి పాత్రలలో నటించే అవకాశాలు వచ్చాయని గుర్తుచేసుకుంది. పసివాడి ప్రాణం సినిమాలో యాక్టింగ్ తనకు అంతగా గుర్తు లేదని తెలిపింది. కాగా చిరంజీవితోపాటు తెలుగులో వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించింది సుజిత ధనుష్.