
సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి, తమ క్యూట్ లుక్స్తో ప్రేక్షకుల మనసులు గెలుచుకునే బాలనటులు చాలామంది ఉంటారు. అయితే అందులో కొందరు మాత్రమే జీవితాంతం గుర్తుండిపోయే బలమైన ముద్ర వేస్తారు. అలాంటి వారిలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన బ్లాక్బస్టర్ చిత్రం 'బజరంగీ భాయిజాన్' ఫేమ్ హర్షాలీ మల్హోత్రా ఒకరు.

ఈ సినిమాలో 'మున్ని' అనే మూగ పాప పాత్రలో నటించిన హర్షాలీని ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేరు. అమాయకమైన ముఖం, కల్మషం లేని నవ్వుతో ఆనాడు థియేటర్లలో అందరినీ ఏడిపించి, నవ్వించిన ఆ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే.వేలాది మంది పిల్లల ఆడిషన్స్ తర్వాత ఈ పాత్రకు ఎంపికైన హర్షాలీ, సినిమాలో ఒక్క డైలాగ్ కూడా మాట్లాడకుండానే కేవలం తన హావభావాలతోనే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది.

ఆ తర్వాత ఈమె నటనకు కొంతకాలం పాటు లాంగ్ బ్రేక్ ఇచ్చి పూర్తిగా తన చదువుపైనే శ్రద్ధ పెట్టింది. ఇటీవలే ఆమె తన 12వ తరగతి చదువును కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. నటనకు దూరంగా ఉన్నప్పటికీ, హర్షాలీ సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ తన అభిమానులకు టచ్లోనే ఉంటుంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో ఈమెకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ప్రస్తుతం ఆమెకు 3.7 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. చదువుతో పాటు ఆమెకు భారతీయ సాంప్రదాయ నృత్యమైన కథక్ అంటే ఎంతో ఇష్టం. తన క్లాసికల్ డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియోలను, అందమైన గ్లామరస్ ఫోటోలను నిరంతరం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్గా మారుతుంటుంది. హర్షాలీ గ్లామర్ లుక్స్ చూసిన నెటిజన్లు ఆనాటి చిన్నారి మున్ని ఇంత అందంగా మారిపోయిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే తాజాగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'అఖండ 2: తాండవం' సినిమాతో హర్షాలీ మల్హోత్రా చిత్ర పరిశ్రమలోకి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్లో చైల్డ్ ఆర్టిస్ట్గా మెప్పించిన ఈ ముద్దుగుమ్మ, టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్తో కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడం విశేషం. చదువును, నటనను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్న హర్షాలీ, భవిష్యత్తులో హీరోయిన్గా మరిన్ని మంచి అవకాశాలు అందుకోవాలని, సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్గా ఎదగాలని మనసారా కురుకుంటున్నారు అభిమానులు.