
2025లో బాలీవుడ్ నుంచి చాలా డెబ్యూస్ ఉండబోతున్నాయి. వారసులు, వారసురాళ్లు బాగానే పరిచయం కాబోతున్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది రవీనా టాండన్ కూతురు రాషా టాండన్ గురించే.

అజాద్ అనే సినిమాతో ఈమె పరిచయం అవుతున్నారు. ఇదే సినిమాతో అజయ్ దేవ్గన్ మేనల్లుడు అమన్ దేవ్గన్ ఎంట్రీ ఇస్తున్నారు.ఉయి అమ్మా అంటూ అదిరిపోయే గ్లామర్ షో చేస్తున్నారు రాషా టాండన్.ఫస్ట్ సినిమాకే డోస్ పెంచేసారు రాషా.

ఇక 2025లో బాలీవుడ్కు పరిచయం కానున్న మరో వారసుడు వీర్ పహారియా. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడే ఈ వీర్ పహారియా. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న స్కై ఫోర్స్ సినిమాతో ఈయన పరిచయం అవుతున్నారు.

స్కై ఫోర్స్లో తన మాజీ ప్రేయసి సారా అలీ ఖాన్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు వీర్. ఈ సినిమా జనవరి 24న విడుదల కానుంది. ఇండియన్ ఆర్మీ చేసిన ఫస్ట్ ఎయిర్ అటాక్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు అభిషేక్ కపూర్, సందీప్ కెవ్లానీ ధ్వయం. దేశభక్తి ప్రధానంగా స్కై ఫోర్స్ వస్తుంది.

షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ సైతం 2025లోనే ఎంట్రీ ఇస్తున్నారు.. కాకపోతే హీరోగా కాదు దర్శకుడిగా..! తన మొదటి సినిమాను సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీంతో ప్లాన్ చేస్తున్నారు ఆర్యన్. రాషా టాండన్ హీరోయిన్. అలాగే అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్, సాయి పల్లవి నటిస్తున్న సినిమా ఇదే ఏడాది విడుదల కానుంది.