
సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో రుక్మిణి వసంత్ ఒకరు. ఒక్కసారిగా దక్షిణాదిలో విపరీతమైన పాపులరిటీ సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరాలు దాచే ఎల్లో సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఆమె పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. తర్వాత అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా గుర్తింపు మాత్రం రాలేదు.

ఇటీవల కన్నడలో రిషబ్ శెట్టి నటించిన కాంతార చాప్టర్ 1 సినిమాతో పాన్ ఇండియా లెవల్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో విలన్ గా కనిపించి మెప్పించింది. దీంతో ఆమె పేరు యావత్ భారతీయ సినీ పరిశ్రమలో మారుమోగింది.

దీంతో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ చిత్రంలో నటిస్తుంది. అలాగే తెలుగు, కన్నడ, తమిళంలో ఈ అమ్మడు మరిన్ని ఆఫర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

అటు సినిమాలతోపాటు ఇటు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఆకుపచ్చ చీరలో అందంగా మెరిసిపోయింది.

ఆకుపచ్చ పట్టు చీరలో మరింత అందంగా ముస్తాబైంది. తాజాగా షేర్ చేసిన ఫోటోలలో ఆమె అచ్చం కుందనపు బొమ్మలా కనిపిస్తుంది. అందులో చూడచక్కని వెన్నెలమ్మలా కనిపిస్తుందని కామెంట్స్ షేర్ చేస్తున్నారు.