టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది రీతు వర్మ. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ లేటేస్ట్ ఫోటోస్, ఫ్యామిలీ విషయాలు పంచుకుంటుంది.
తాజాగా రీతువర్మ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. అందులో పట్టుచీరలో పసిడి బొమ్మగా మెరిసిపోతుంది రీతు. చూడచక్కని రూపం.. అందమైన చిరునవ్వుతో కట్టిపడేస్తుంది.
క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ చీరకట్టులో.. కొప్పులో మల్లెలతో ఎంతో అందంగా ముస్తాబయ్యింది రీతు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోస్ వైరలవుతుండగా.. అద్భుతంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రీతు వర్మ హైదరాబాద్ అమ్మాయే. 2013లో బాద్ షా సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగులో అనేక సినిమాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది రీతువర్మ.
రీతు వర్మ ఇటీవల మార్క్ ఆంటోని చిత్రంలో నటించింది. ఈ తెలుగమ్మాయి ఇప్పుడు తమిళంలోనూ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె చేతిలో తమిళ్ మూవీస్ ఉన్నట్లు తెలుస్తోంది.