
బాహుబలి (Baahubali).! ఈ సినిమానే పాన్ ఇండియా అనే పదాన్ని అందరికీ పరిచయం చేసింది. ఈ సినిమానే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ స్టామినా ఏంటో వరల్డ్ వైడ్ తెలిసేలా చేసింది. ఈ సినిమానే..

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)ను పాన్ ఇండియా స్టార్ను చేసింది. డైరెక్టర్లందరిలో జక్కన్న (Rajamouli) ప్రత్యేక క్రియేట్ చేసింది. ఈ సినిమానే హైయెస్ట్ కలెక్షెడ్ మూవీగా.. బాక్సాఫీస్ ముందు నిలిచింది.

ఇంటర్నేషనల్ వేదికల మీద అనేక అవార్డులను గెలిచింది. ఇప్పుడే ఇదే సినిమా మరో సారి ట్విట్టర్ (Twitter) వేదికగా ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే ఈ సినిమా రిలీజై 7 సంవత్సరాలు కావస్తుంది కనుక!

2015 జూలై 10! ఇదే రోజున రిలీజైంది బాహుబలి ఫస్ట్ పార్ట్ ది బిగినింగ్ (Baahubali: The Beginning). దాదాపు 180 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన బాహుబలి 1st పార్ట్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా గమనాన్ని ఒక్క సారిగా మర్చేసింది.

తెలుగు సినిమాలను పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా ... తెలుగు దర్శకులను పాన్ ఇండియ డైరెక్టర్లుగా మార్చింది. అప్పటికే ఈగ సినిమాతో.. నేషనల్ వైడ్ పాపులర్ అయిన రాజమౌళి..

తన తండ్రి రాజేంద్ర ప్రసాద్ రాసిన స్టోరీతో పాన్ ఇండియా రేంజ్ లో అత్యంత ఎక్కువ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కించాలని అనుకున్నారు.

అందుకోసం డార్లింగ్ ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలను ప్రధాన పాత్రలకు ఎంపిక చేసుకున్నారు. జక్కన్న ఆలోచనలకు అనుగుణంగానే.. ఆర్కా మీడియా వర్క్ అధినేత శోభు యార్ల గడ్డ ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారు.

అలా బాహుబలి ది బిగినింగ్ కోసం పడిన అడుగు.. ఆ తరువాత బాహుబలి ది కంక్లూషన్ వరకు సాగింది. అప్పటి వరకు తెరకెక్కిని భారీ సినిమాగా బాహుబలిని మార్చింది.

అయితే తాజాగా ఈ సినిమా 7 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో... #prabhas, #7YearsOfBahubali ట్యాగ్లను ట్రెండ్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్ . ట్రెండ్ చేయడమే కాదు..

ఈసినిమాలోని ప్రభాస్ ఫోటోలను , రాణా ఫోటోలను మరో సారి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ... బాహుబలి మేనియాను మరో సారి గుర్తు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో బాహుబలికి సంబంధించిన ఫొటోస్ ట్రెండ్ అవుతున్నాయి

సోషల్ మీడియాలో బాహుబలికి సంబంధించిన ఫొటోస్ ట్రెండ్ అవుతున్నాయి

సోషల్ మీడియాలో బాహుబలికి సంబంధించిన ఫొటోస్ ట్రెండ్ అవుతున్నాయి