
మటన్లో ఐరన్, జింక్, విటమిన్ బి12 వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, దీనిలో ఉండే అధిక సంతృప్త కొవ్వు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇబ్బందికరంగా మారవచ్చు. ఎర్ర మాంసం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. ఇది టైప్-2 డయాబెటిస్ను మరింత క్లిష్టతరం చేయడమే కాకుండా గుండె జబ్బులకు కూడా దారితీయవచ్చు. మటన్ను పూర్తిగా మానేయాల్సిన పనిలేదు.. కానీ వారానికి ఒకటి లేదా రెండుసార్లు చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవడం ఉత్తమం.

చికెన్ అనేది మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆహారంలో సురక్షితమైన భాగంగా ఆరోగ్య నిపుణులు ధృవీకరిస్తున్నారు. చికెన్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండి కొవ్వు తక్కువగా ఉంటుంది. దీని గ్లైసెమిక్ సూచిక కూడా తక్కువగా ఉండటం వల్ల ఇది తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు. సరైన మోతాదులో చికెన్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందడమే కాకుండా గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

ఇంకా అపుడప్పుడు చికెన్ తీసుకోవచ్చు. కానీ, ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే, దీనిలో మసాలాలు ఎక్కువగా ఉంటాయి. తిన్నా కూడా చాలా తక్కువే తీసుకోవాలని చెబుతున్నారు.

షుగర్ నిర్వహణలో మటన్ కంటే చికెన్ సురక్షితమైన ఎంపిక. ఏ మాంసమైనా సరే మితంగా తినడం మరియు వంటలో నూనెను తగ్గించడం వల్ల చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి డైటీషియన్ సలహా తీసుకోవడం ఇంకా మంచిది.