
వేసవి కాలంలో పెరుగు తినడం కంటే బటర్ మిల్క్ తాగడం చాలా మంచిది. ఎందుకంటే, పెరుగు తినే సమయంలో కొందరికి గుండెల్లో పట్టేసినట్టుగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు మజ్జిగ తాగడమే బెటర్.

మీరు పెరుగును తినే కన్నా మజ్జిగలో అర టీ స్ఫూన్ జీలకర్ర, కొద్దిగా ఉప్పు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసుకుని తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.

ఉదయం పెరుగు తింటే ఏం కాదు రాత్రి వేళల్లో పెరుగు తింటే జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇంకా మనిషిని ఇబ్బంది పెట్టే కఫం వంటివి కూడా వస్తుంటాయి.

పుల్లటి పెరుగును వేసవి కాలంలో తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే, తిన్న దగ్గర నుంచి గ్యాస్ అసిడిటీ సమస్యలు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది.

ఫ్రిజ్లో పెట్టిన పెరుగును కాకుండా 15 నిముషాల తర్వాత అన్నంలో వేసుకుని తింటే కూలింగ్ తగ్గిపోతుంది. దీని వలన అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.