
పెట్రోల్ ధరలు ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. రాష్ట్రాలు విధించే ప్రత్యేక ట్యాక్సులు, రవాణా ఖర్చులను పరిగణలోకి తీసుకుని ధరలను ఆయిల్ కంపెనీలు నిర్ణయిస్తూ ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటాయి. పెట్రోల్ ధరల విషయంలో ట్యాక్సులు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. పెట్రోల్, డీజిల్పై ఎన్ని రకాల పన్నులు విధిస్తారు..? ఒకవేళ విధించకపోతే ధర ఎంత ఉంటుంది? అనే విషయాలు చూద్దాం.

పెట్రోల్, డీజిల్పై కేంద్రం ట్యాక్సులు, సెస్లు విధిస్తూ ఉంటుంది. ధరల్లో వీటి వాటా ఎక్కువగా ఉంది. వినియోగదారులపై వీటి భారం నేరుగా పడుతుంది. ఈ పన్నులను తగ్గిస్తే వీటి ధరలు తగ్గుతాయి. తాజాగా కేంద్రం పెట్రోల్పై రూ.13 నుంచి రూ.3కు ఎక్సై్జ్ సుంకం తగ్గించగా..డీజిల్పై రూ.10 నుంచి జీరోకు తగ్గించింది. అంటే ఈ రెండింటిపై రూ.10 మేర తగ్గించింది. దీని వల్ల ధరలు తగ్గనున్నాయి.

ఇక రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ విధిస్తున్నాయి. దీంతో ఎక్సైజ్ సుంకం, వ్యాట్ కలుపుకుంటే పెట్రోల్ రేటు ఎక్కువవుతుంది. ఈ సుంకాలు, వ్యాట్లు ధరల్లో 40 శాతం కలిగి ఉంటాయి. వీటిని తొలగిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు సగానికి తగ్గుతాయి. ఉదాహరణకు ఢిల్లీలో ప్రస్తుతం తీసుకుంటే.. పెట్రోల్ ధర రూ.94.77గా ఉంది. సుంకాలు, వ్యాట్ తగ్గిస్తే రూ.52కే లభించే అవకాశం ఉంటుంది.

ఉదాహరణకు ఆగస్టు 2025 డేటా ప్రకారం పెట్రోల్ బేస్ ధర లీటర్కు రూ.52.83గా ఉంది. డీలర్లకు విధించే రవాణా ఖర్చుల తర్వాత లీటర్కు రూ.53.07 పెరుగుతుంది. ఇక కేంద్రం విధించ సుంకం లీటర్పై రూ.11.9గా ఉంది. ఇక పెట్రల్ పంప్ అపరేటర్ల లాభాల మార్జిన్ను సూచించే డీలర్ కమిషన్లుల లీటర్కు రూ.4.40 చొప్పున ఉంటాయి. దీంతో పెట్రోల్ అసలు ధర మొత్తం రిటైల్ ధరల సగం మాత్రమే ఉంటుంది.

ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుున్నాయి. ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అయినా పన్నుల విధానం వల్ల దేశీయ ధరల్లో ఆశించిన ఫలితం వాహదారులకు లభించదని నిపుణులు చెబుతున్నారు. ట్యాక్సులు తగ్గిస్తేనే ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుంది.