
దేశంలో కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రయాణికులకు ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. టెక్నాలజీతో కూడిన కొత్త కొత్త రైళ్లను ప్రవేశపెడుతోంది. అత్యంత వేగవంతమైన ప్రయాణాన్ని అనుభవించేందుకు రైల్వే అధునాతన రైళ్లను ప్రవేశపెడుతోంది. హైస్పీడ్ రైళ్లను తీసుకువస్తోంది.

దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలు ఎక్కేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ రైళ్లను కూడా రానున్న రోజుల్లో ప్రారంభించవచ్చు. దీని ద్వారా ప్రయాణికులు ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. మరోవైపు వందే భారత్ మెట్రో రైళ్లను కూడా చాలా చోట్ల ప్రారంభించగా, మరికొన్ని చోట్ల ప్రారంభం కానున్నాయి. రానున్న రోజుల్లో గుజరాత్కు వందే భారత్ మెట్రో రైలు అందుబాటులోకి రానుంది.

వందే భారత్ మెట్రో రైలు గుజరాత్లోని వడోదర - అహ్మదాబాద్ మధ్య నడుస్తుంది. దీంతో లక్షలాది మంది ప్రయాణికులకు ఊరట లభిస్తుంది. వందే మెట్రో రైలు ట్రయల్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. పశ్చిమ రైల్వే ముఖ్య ప్రతినిధి జేకే జయంత్ కూడా ట్రయల్ రన్ను ధృవీకరించారు. వందే మెట్రో రైలు ప్రతిరోజూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇందులో అధునాతన ఫీచర్లను అందించారు.

ఇటీవల, అహ్మదాబాద్లో 20 కోచ్లతో వందే భారత్ రైలు ట్రయల్ రన్ కూడా జరిగింది. ప్రస్తుతం వందే భారత్ ఎనిమిది కోచ్లతో నడుస్తుండగా, 16 కోచ్లతో నడిచే సామర్థ్యం ఉంది. ఇటీవల, వందేభారత్ను 20 కోచ్లతో పరీక్షించారు. ఈ సమయంలో రైలు వేగం కూడా గంటకు 130 కిలోమీటర్లు.

యూపీ ప్రజలకు త్వరలో మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. ఈ సెమీ-హై స్పీడ్ రైలు త్వరలో లక్నో - భోపాల్ మధ్య నడుస్తుందని తెలుస్తోంది. ఎనిమిది కోచ్లతో కూడిన ఈ రైలు రైల్వే బోర్డు ప్రారంభించింది. దీపావళికి ముందే ఈ రైలును అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే అధికారిక షెడ్యూల్ మాత్రం ఇంకా ప్రకటించలేదు.