
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్న ఒక్క మాటకి బంగారం, వెండి ధరలు భారీ నుంచి అతి భారీగా పెరుగుతున్నాయి. దీంతో, రేట్లు కూడా విపరీతంగా పెరగడంతో సామాన్యుల దగ్గర నుంచి బిజినెస్ మేన్స్ వరకు భయపడుతున్నారు.

25025 నుంచి ఈ రేట్ల బాదుడు మొదలైంది. ఇప్పటి వరకు కూడా తగ్గలేదు, రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇక మన వాళ్ళు షాపుల వద్దకు వెళ్ళి కొనకుండా వెనుతిరిగి వచ్చేస్తున్నారు. దీన్ని చూస్తున్న కొందరు షాక్ అవుతుంటే, మరికొందరు తగ్గుతాయ్ లే అని అంటున్నారు.

అయితే, నేడు ఒక్కసారిగా రూ.13,000 పెరిగి తొలిసారి రూ. 4 లక్షల వరకు చేరుకుంది. ఈ రేంజ్ లో పెరగడం ఇదే మొదటిసారి. పెరిగిన ఈ ధరలు చూసి గోల్డ్స్ లవర్స్ కూడా షాక్ అయ్యారు. బంగారం చేతికి దొరకడం లేదు. ఇక ఇప్పుడు వెండి కూడా దొరకదా అని లబో దిబో అంటున్నారు.

ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా వరంగల్, నిజాంబాద్, ఖమ్మం ఇలా అన్ని తెలంగాణలోని అన్ని ఏరియాల్లో ధరలు పెరిగాయి.

అటు ఆంధ్రాలో కూడా విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, కడప వంటి పట్టణాల్లో ఇలాగే పెరిగాయి. ఇక అక్కడి ప్రజలు అయితే, ముందు ముందు పట్టీలు కూడా దొరకవేమో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.