అత్యధిక వడ్డీ అందించే స్కీమ్‌..! కేవలం రూ.1000 నుంచి పెట్టుబడి స్టార్ట్‌ చేయొచ్చు!

Updated on: Feb 17, 2026 | 8:40 PM

సురక్షిత పెట్టుబడి, స్థిరమైన ఆదాయం కోరుకునే వృద్ధులకు పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) అద్భుతమైన ఎంపిక. ప్రస్తుతం 8.2 శాతం అధిక వడ్డీతో, ఇది అనేక బ్యాంక్ FDల కంటే మెరుగ్గా ఉంది. సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలను కూడా కల్పిస్తుంది.

1 / 5
సురక్షిత పెట్టుబడి, స్థిరమైన ఆదాయం కోరుకునే వృద్ధులకు పోస్టాఫీసు పథకాలు మంచి ఎంపికగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా Senior Citizens Savings Scheme (SCSS) పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను కల్పించే ప్రజాదరణ పొందిన పథకం. ప్రస్తుతం ఈ పథకంపై ప్రభుత్వం సంవత్సరానికి 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇది అనేక బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్‌ల కంటే ఎక్కువగా ఉండటం విశేషం.

సురక్షిత పెట్టుబడి, స్థిరమైన ఆదాయం కోరుకునే వృద్ధులకు పోస్టాఫీసు పథకాలు మంచి ఎంపికగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా Senior Citizens Savings Scheme (SCSS) పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను కల్పించే ప్రజాదరణ పొందిన పథకం. ప్రస్తుతం ఈ పథకంపై ప్రభుత్వం సంవత్సరానికి 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇది అనేక బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్‌ల కంటే ఎక్కువగా ఉండటం విశేషం.

2 / 5
ఈ పథకంలో కనీసంగా రూ.1,000తో ఖాతా ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి రూ.30 లక్షలు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.

ఈ పథకంలో కనీసంగా రూ.1,000తో ఖాతా ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి రూ.30 లక్షలు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.

3 / 5
60 సంవత్సరాలు పైబడిన వారు వ్యక్తిగతంగా లేదా జీవిత భాగస్వామితో కలిసి జాయింట్ ఖాతా తెరవవచ్చు. అలాగే 55–60 సంవత్సరాల మధ్య వయస్సు గల VRS ఉద్యోగులు, 50–60 సంవత్సరాల మధ్య రిటైర్డ్ రక్షణ సిబ్బంది కూడా నిబంధనల ప్రకారం పెట్టుబడి పెట్టవచ్చు.

60 సంవత్సరాలు పైబడిన వారు వ్యక్తిగతంగా లేదా జీవిత భాగస్వామితో కలిసి జాయింట్ ఖాతా తెరవవచ్చు. అలాగే 55–60 సంవత్సరాల మధ్య వయస్సు గల VRS ఉద్యోగులు, 50–60 సంవత్సరాల మధ్య రిటైర్డ్ రక్షణ సిబ్బంది కూడా నిబంధనల ప్రకారం పెట్టుబడి పెట్టవచ్చు.

4 / 5
ఈ పథకపు మెచ్యురిటీ కాలం 5 సంవత్సరాలు. అవసరమైతే మరిన్ని 3 సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం ఉంది. ప్రతి త్రైమాసికానికి వడ్డీ చెల్లింపు జరుగుతుంది. అయితే గడువు పూర్తికాకముందే ఖాతా క్లోజ్‌ చేస్తే జరిమానా ఉంటుంది.

ఈ పథకపు మెచ్యురిటీ కాలం 5 సంవత్సరాలు. అవసరమైతే మరిన్ని 3 సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం ఉంది. ప్రతి త్రైమాసికానికి వడ్డీ చెల్లింపు జరుగుతుంది. అయితే గడువు పూర్తికాకముందే ఖాతా క్లోజ్‌ చేస్తే జరిమానా ఉంటుంది.

5 / 5
ఉదాహరణకు రూ.25 లక్షలు 8.2 శాతం వడ్డీతో పెట్టుబడి పెడితే, సంవత్సరానికి సుమారు రూ.2,05,000 వడ్డీ వస్తుంది. అంటే త్రైమాసికానికి రూ.51,250, నెలకు సుమారు రూ.17,083 ఆదాయం లభిస్తుంది. ఒకసారి పెట్టుబడి చేసిన తర్వాత ఆ కాలానికి వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది. దీంతో రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం పొందవచ్చు.

ఉదాహరణకు రూ.25 లక్షలు 8.2 శాతం వడ్డీతో పెట్టుబడి పెడితే, సంవత్సరానికి సుమారు రూ.2,05,000 వడ్డీ వస్తుంది. అంటే త్రైమాసికానికి రూ.51,250, నెలకు సుమారు రూ.17,083 ఆదాయం లభిస్తుంది. ఒకసారి పెట్టుబడి చేసిన తర్వాత ఆ కాలానికి వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది. దీంతో రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం పొందవచ్చు.

Follow Us