
ప్రయాణికులకు రైల్వేశాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటివరకు అన్రిజర్వుడ్, ఫ్లాట్ఫామ్ టికెట్ల బుకింగ్, ఇతర సేవలు అందించిన రైల్వేశాఖ యూటీఎస్ యాప్ ఇక నుంచి బంద్ కానుంది. మార్చి 1వ తేదీ నుంచి ఈ యాప్ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఈ యాప్ స్థానంలో రైల్ వన్ యాప్ ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది.

ఇక నుంచి రైల్ వన్ యాప్ రైల్వేశాఖకు సంబంధించిన అన్నీ సేవలు ప్రజలకు ఒకేచోట అందించనుంది. టికెట్ల బుకింగ్, ఫుడ్ సర్వీసులు, రైళ్ల ట్రాకింగ్, ఫిర్యాదులు.. ఇలా అన్నీ సేవలు ప్రయాణికులకు ఒకేచోట లభించనున్నాయి. ఇప్పటివరకు టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఆర్సీటీసీ, అన్రిజర్వుడ్ టికెట్ల కోసం యూటీఎస్, రైళ్ల ట్రాకింగ్ కోసం మరో ఫ్లాట్ఫామ్ వాడాల్సి వచ్చేది.

ఇక నుంచి రైల్ వన్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే చాలు.. రైల్వేలకు సంబంధించి సమగ్ర సేవలు అందుబాటులో ఉండనున్నాయి. దీని వల్ల వేర్వురు ఫ్లాట్ఫామ్లను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల సమయం ఆదా అవుతుంది. యూటీఎస్ యాప్ను దశలవారీగా రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది

మొదటి దశలో టికెట్ బుకింగ్, కొత్త యూజర్ రిజిస్ట్రేషన్ సేవలు ఆపివేస్తున్నారు. ఇక ఫ్లాట్ఫామ్ టికెట్ల బుకింగ్, ఆర్ వాలెట్ టాప్ యాప్ సేవలు మూసివేశారు. యూటీఎస్ యాప్ లేటెస్ట్ వెర్షన్ను డౌన్లోడ్ చేసుకున్నవారు ఫ్లాట్ఫామ్ టికెట్లను బుక్ చేసుకోవడానికి లేదా ఆర్ వాలెట్ను రీఛార్జ్ చేసుకోవడానికి వీలు పడటం లేదు

అయితే యూటీఎస్ యాప్లో ఇప్పటికే ఆర్ వాలెట్లో బ్యాలెన్స్ ఉంటే సురక్షితంగా, భద్రంగా ఉంటుంది. అందులో ఉండే బ్యాలెన్స్ లాప్ అవ్వదు. ఈ బ్యాలెన్స్ మీరు రైల్ వన్ యాప్లో వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. రైల్ వన్ యాప్లో ఆన్రిజర్వ్డ్, ఫ్లాట్ఫామ్స్ టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. ఇక రిజర్వ్డ్ టికెట్ల సేవలను కూడా అందిస్తోంది.