దేశంలో ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ సరికొత్త వెర్షన్తో కూడిన హీరో స్ప్లెండర్ ప్లస్ వాహనాన్ని విడుదల చేసింది.
ఈ బైక్ ధర రూ.82,911 (ఎక్స్-షోరూమ్) కాగా.. ఇది ప్రస్తుతం మోడల్ కంటే రూ. 3 వేలు అధిక ధరకు లభిస్తోందని చెప్పింది.
మ్యాట్ గ్రే, గ్లోస్ బ్లాక్, గ్లోస్ రెడ్ కలర్ మూడు కలర్ ఆప్షన్లలో ఈ వెర్షన్ అందుబాటులో వచ్చింది.
ఈ బైక్ ఇంజిన్ 4-స్పీడ్ గేర్బాక్స్తో అందుబాటులోకి వస్తోంది. i3s(ఐడిల్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్) టెక్నాలజీ ఇందులో అమర్చబడి ఉంది.
ఇక ఈ బైక్లో 9.8 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. అలాగే ఈ బైక్ లీటరుకు 73 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
సైడ్-స్టాండ్ ఇండికేటర్, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ ఇండికేటర్, కాల్, మెసేజ్ అలర్ట్లతో బ్లూటూత్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి అనేక ఫీచర్లు ఈ బైక్తో వస్తున్నాయి.