
అర్హత ఇదే.. పీఎం కిసాన్ మన్ధన్ యోజన స్కీమ్లో చేరేందుకు రైతులకు మాత్రమే అవకాశం ఉంది. 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు ఈ పథకంలో చేరొచ్చు. ప్రభుత్వ భూ రికార్డుల్లో పేరు ఉండి.. రెండు హెక్టార్ల వరకూ సాగు చేయదగిన భూమి ఉన్న వారు అర్హులు. ప్రస్తుతం 19,47,588 మంది రైతులు ఈ పథకంలో నమోదు చేసుకున్నారు.

వీరు అనర్హులు.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఇతర పథకాలలో అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్), ఈఎస్ఐ, ఈపీఎఫ్ఓ వంటి పథకాలలో రిజిస్టర్ అయిన వారికి మాత్రమే ఈ స్కీమ్ నమోదుకు అనర్హులు.

ప్రీమియం ఎంత.. ఈ పథకంలో చేరే రైతు వయసును బట్టి ప్రీమియం ఉంటుంది. రూ. 55 నుంచి రూ. 200 వరకూ ప్రతి నెలా చెల్లించాల్సి ఉంటుంది. రైతు 18 ఏళ్ల వయసులో చేరితే రూ. 55 ప్రీమియం, 40 ఏళ్ల వయసులో చేరితే నెలకు రూ. 200 ప్రీమియం రైతు చెల్లించాల్సి ఉంటుంది. వీరికి 60 ఏళ్లు నిండాక ప్రతి నెలా రూ. 3000 వరకూ పింఛన్ అందుతుంది. రైతు చనిపోతే భార్యకు ప్రతినెలా రూ.1500 పింఛన్ వస్తుంది.

ఈ పత్రాలు కావాలి.. 2 హెక్టార్ల వరకు భూమి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకోసం ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు, వయస్సు సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, పంట పొలాల ఖస్రా ఖాతాని, బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కలిగి ఉండాలి.

కనీసం ఐదేళ్లు కట్టాలి.. రైతు చనిపోయినా కూడా వారి జీవిత భాగస్వామి ఈ పథకం కొనసాగించొచ్చు. అయితే రైతు కనీసం ఐదేళ్ల వరకూ తన ప్రీమియంను నిర్ధేశిత తేదీ ప్రకారం చెల్లించి ఉండాలి. వయసు నిండిన తర్వాత రైతు చనిపోతే.. ఆ రైతు జీవితభాగస్వామికి సగం పింఛన్ ఇస్తారు.