
Air, Water Purifiers: దేశంలోని అనేక ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యం, గాలి నాణ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో సామాన్యులకు కొంత ఉపశమనం లభించవచ్చు. గాలి, నీటి శుద్ధి చేసే యంత్రాలపై GSTని గణనీయంగా తగ్గించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బిజినెస్ స్టాండర్డ్లోని ఒక నివేదిక ప్రకారం.. జీఎస్టీ (GST) కౌన్సిల్ రాబోయే 15 రోజుల్లో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. దీనిలో ఈ పరికరాలపై పన్నును 18% నుండి 5%కి తగ్గించే ప్రతిపాదనపై చర్చించే అవకాశం ఉంది.

నిత్యావసరాల కేటగిరిలోకి ప్యూరిఫైయర్లు: ప్రస్తుతం గాలి, నీటి శుద్ధి చేసే యంత్రాలను నిత్యావసరాల కేటగిరిలోకి వచ్చే అవకాశం ఉంది. వీటిపై 18% GST విధిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడు వాటిని నిత్యావసరాల వస్తువుల జాబితాలో చేర్చే ఆలోచన చేస్తోంది. ఇలా చేసినట్లయితే వీటిపై జీఎస్టీ భారీగా తగ్గే అవకాశం ఉంది. ఈ నిర్ణయం అమలు చేసినట్లయితే ఎయిర్ ప్యూరిఫైయర్ల ధర 10% నుండి 15% వరకు తగ్గుతుందని తెలుస్తోంది. తద్వారా తక్కువ ఆదాయ కుటుంబాలకు కూడా స్వచ్ఛమైన గాలి, సురక్షితమైన నీరు వంటివి తక్కువ ధరల్లో అందుబాటులోకి వస్తుంది.

పన్ను తగ్గింపు చర్చ వెనుక ఢిల్లీ హైకోర్టు జోక్యం కూడా ఒక ప్రధాన కారణం. ఇటీవల ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) విచారణ సందర్భంగా కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. ఢిల్లీ-ఎన్సిఆర్లోని పౌరులు స్వచ్ఛమైన గాలిని పొందలేకపోతే, గాలిని శుద్ధి చేసే యంత్రాలపై కనీసం పన్నులు తగ్గించాలని కోర్టు పేర్కొంది. వీలైనంత త్వరగా సమావేశం ఏర్పాటు చేయాలని కోర్టు కౌన్సిల్ను ఆదేశించింది.

కోర్టు మాత్రమే కాదు, సైన్స్, టెక్నాలజీ, పర్యావరణంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా తన డిసెంబర్ నివేదికలో దీనిని నొక్కి చెప్పింది. ప్రజలు గాలి శుద్ది, నీటిని శుద్ది చేసే యంత్రాలులపై ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. గాలి, నీటి శుద్ధి యంత్రాలతో పాటు వాటి విడిభాగాలు (ఫిల్టర్లు వంటివి) పై పన్నులను తొలగించాలని లేదా తగ్గించాలని కూడా సిఫార్సు చేసింది.

ఉదాహరణకు.. మీరు రూ. 15,000కు ఎయిర్ ప్యూరిఫైయర్ కొనుక్కున్నారనుకుందాం. ఇప్పుడు (18% GST) ఉంది. మీరు దాదాపు రూ. 2,700 పన్నులు మాత్రమే చెల్లించాలి. ప్రతిపాదిత (5% GST)కి తగ్గించినట్లయితే మీరు కవేలం రూ. 750 ట్యాక్స్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.1,950 వరకు ఆదా చేసుకోవచ్చు.