
అమెరికా-వెనిజులా మధ్య వివాదం తారాస్థాయికి చేరుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. దీని వల్ల పసిడిపై పెట్టుబడులు పెరగడంతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. సోమవారం నుంచి బంగారం ధరల్లో పెరుగుదల నమోదవుతూ వస్తోంది. నిన్న గోల్డ్ రేట్లు పెరగ్గా.. మంగళవారం కూడా మరికొంత పెరిగాయి.

హైదరాబాద్లో సోమవారం ధరలతో పోలిస్తే మంగళవారం తులం బంగారంపై రూ.600 పెరిగింది. ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,38,820గా కొనసాగుతుండగా.. నిన్న ఈ ధర రూ.1.38,220 వద్ద స్ధిరపడింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు మంగళవారం రూ.1,27,250 వద్ద ట్రేడవుతోంది.

నిన్నటితో పోలిస్తే 22 క్యారెట్ల బంగారంపై రూ.500 పెరిగింది.ఇక విశాఖపట్నం, విజయవాడలో ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఇక చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,39,970గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,28,300 వద్ద కొనసాగుతోంది.

ఇక వెండి ధరలు అయితే భారీగా పెరుగుతున్నాయి. చెన్నైలో కేజీ వెండిపై నిన్నటి పోలిస్తే రూ.5 వేలు పెరిగింది. నిన్న కేజీ వెండి ధర రూ.2,66,000గా ఉండగా.. మంగళవారం రూ.2,71,000 వద్ద కొనసాగుతోంది. ఇక బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2,53,000 వద్ద ట్రేడవుతోంది.

ఇక హైదరాబాద్లో నిన్నటితో పోలిస్తే కేజీ వెండి ధర ఏకంగా రూ.6 వేలు పెరిగింది. సోమవారం రూ.2,65,000 వద్ద స్థిరపడగా.. మంగళవారం రూ.2,71,000 వద్ద కొనసాగుతోంది. అటు విజయవాడ, విశాఖపట్నంలో ఇవే ధరలు ఉన్నాయి.