
Best Investment Scheme: డబ్బు సంపాదించేందుకు రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ రాబడి వచ్చేలా ప్లాన్ తీసుకోవచ్చు. ప్రస్తుత కాలంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు మాత్రమే జీతం పొందే ఉద్యోగులు, కార్మికులు, చిన్న వ్యాపారులు భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం సహజం. అయితే, ప్రతిరోజూ కేవలం రూ.50 మాత్రమే ఆదా చేసినట్లయితే మీకు మెచ్యూరిటీ సమయంలో లక్షలాది రూపాయలు కూడబెట్టుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.

రోజుకు కేవలం రూ.50 అంటే నెలకు రూ.1,500 మాత్రమే ఆదా చేయగలిగితే చాలు. ఈ మొత్తాన్ని 25 లేదా 30 ఏళ్ల వయసు నుంచే క్రమం తప్పకుండా పెట్టుబడిగా పెట్టడం ప్రారంభిస్తే, భవిష్యత్తులో మంచి నిధిని సృష్టించుకోవచ్చు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) వంటి సురక్షితమైన పొదుపు పథకాన్ని ఎంచుకోవచ్చు. ఈ స్కీమ్లో ప్రస్తుతం వార్షికంగా 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. మీరు డబ్బుకు ఎలాంటి రిస్క్ ఉండదు.

పోస్టల్ అధికారుల ప్రకారం.. ఒక వ్యక్తి 25 ఏళ్ల వయసులో నెలకు రూ.1,500 చొప్పున పీపీఎఫ్లో పెట్టుబడి పెట్టి, దానిని 60 ఏళ్ల వయసు వరకు నిరంతరాయంగా కొనసాగిస్తే మొత్తం 35 సంవత్సరాల్లో అతను పెట్టే అసలు పెట్టుబడి కేవలం రూ.6.30 లక్షలు మాత్రమే అవుతుంది. అయితే చక్రవడ్డీ (Compounding) ప్రభావంతో ఆ పెట్టుబడిపై దాదాపు రూ.23 లక్షలకు పైగా వడ్డీ చేరి, రిటైర్మెంట్ సమయానికి మొత్తం నిధి సుమారు రూ.30 లక్షలకు చేరే అవకాశం ఉంటుంది.

దీర్ఘకాలంలో సగటున 12 శాతం వరకు రాబడి వస్తే, నెలకు రూ.1,500 పెట్టుబడి 30 ఏళ్లలో సుమారు రూ.50 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే మ్యూచువల్ ఫండ్ల రాబడులు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల లాభాలకు హామీ ఉండదు.

రిటైర్మెంట్ తర్వాత చేతికి వచ్చే రూ.30 లక్షల మొత్తాన్ని పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (MIS) లేదా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) వంటి పథకాలలో పెట్టుబడి పెడితే, ప్రతి నెలా స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.