పెరుగు: పెరుగులో ప్రొటీన్, విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తాయి. అయితే ఉదయాన్నే పెరుగు తినకూడదని మీకు తెలుసా? ఆయుర్వేదంలో ఖాళీ కడుపుతో పెరుగు తినడం ఖచ్చితంగా నిషేధించబడింది. ఎందుకంటే ఇది మన శరీరంలో శ్లేష్మం ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఇక నుంచి పరగడుపున .. లేదా ఏమీ తినకుండా పెరుగు తినకండి.
సిట్రస్ ఫలాలు: అల్పాహారంలో పండ్లు తినడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. పండ్లలో విటమిన్లు, ఖనిజాలతో సహా అనేక పోషకాలు ఉంటాయి. కానీ సిట్రస్ పండ్లను అల్పాహారంలో తినకూడదు. సిట్రస్ పండ్లను ఖాళీ కడుపుతో తినడం వల్ల గుండెల్లో మంట, గ్యాస్, ఇతర సమస్యలు వస్తాయి.
వైట్ బ్రెడ్: వైట్ బ్రెడ్ అల్పాహారంలో ముఖ్యమైన భాగం. బ్రెడ్ తేలికపాటి ఆహారానికి మంచి ఎంపిక. అయితే అల్పాహారంలో వైట్ బ్రెడ్ ను చేర్చుకోరాదు. బ్రెడ్ ను పరగడుపున తినకూడదు.వైట్ బ్రెడ్ మైదా పిండితో తయారు చేయబడుతుంది. తక్కువ మొత్తంలో పోషకాలను కలిగి ఉంటుంది.
స్వీట్స్: ఉదయం .. అంటే పరగడుపున .. ఏమీ తినకుండా స్వీట్లు తినడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి. దీనివల్ల డయాబెటిస్ రిస్క్ కూడా పెరుగుతుంది. అందువల్ల, మీ అల్పాహారంలో చక్కెర పానీయాలను అస్సలు చేర్చవద్దు.
ప్యాక్డ్ ఫుడ్: ఓ వైపు ఇంటి పని.. మరోవైపు ఉద్యోగం చేసే మహిళలు మాత్రమే కాదు... ఇంటికి దూరంగా ఉంటూ ఉద్యోగం చేసే వారికీ కూడా ఉదయం అల్పాహారంగా టిఫిన్ ను సిద్ధం చేసుకునేందుకు సమయం ఉండదు. అలాంటి వ్యక్తులు క్యాన్డ్ ఫుడ్స్ ను ఎంచుకుంటారు. అయితే ఈ ఆహారంలో ఉండే సోడియం రక్తపోటును పెంచుతుంది.