
బియ్యం పిండిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ వంటి గుణాలు ఉన్నాయి. ఈ స్క్రబ్ చర్మంపై పేరుకున్న మురికిని తొలగిస్తుంది. బియ్యం పిండితో చేసిన స్క్రబ్ మీ చర్మానికి సహజమైన మెరుపును తెస్తుంది. ఇంట్లోనే బియ్యం పిండితో స్క్రబ్ను ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

బియ్యం పిండి స్క్రబ్: ఒక గిన్నెలో సుమారు 5 స్పూన్ల బియ్యప్పిండిని తీసుకోండి. దానికి కొంచెం నీళ్ళు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో చర్మాన్ని స్క్రబ్ చేయండి. మీరు 10 నిమిషాల తర్వాత చర్మం నుండి ఈ స్క్రబ్ను తొలగించవచ్చు. ఈ స్క్రబ్ని వారానికి రెండు సార్లు ఉపయోగించడం వల్ల ముఖంలో మెరుపు వస్తుంది.

కలబంద, బియ్యం పిండి: ఒక గిన్నెలో 5 స్పూన్ల బియ్యప్పిండి తీసుకోండి. దానికి అలోవెరా జెల్ కలపండి. అందులో కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి చర్మాన్ని మసాజ్ చేసుకోవచ్చు. ఈ స్క్రబ్తో చర్మాన్ని మసాజ్ చేసుకోండి. కొన్ని నిమిషాల తర్వాత చర్మాన్ని శుభ్రం చేసుకోండి.

బియ్యం పిండి, పాలు: ఒక గిన్నెలో 4 చెంచాల బియ్యప్పిండి తీసుకోండి. దీనికి కొంచెం పాలు కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమంతో చర్మాన్ని స్క్రబ్ చేయండి. అనంతరం మసాజ్ చేసిన తర్వాత చర్మాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా ఈ మిశ్రమంతో చర్మానికి ఈ స్క్రబ్ని వారానికి రెండు సార్లు ఉపయోగించవచ్చు.

తేనె, బియ్యం పిండి: ఒక గిన్నెలో సుమారు నాలుగు చెంచాల బియ్యప్పిండి తీసుకోండి. దానికి కొంచెం తేనె కలిపి పేస్ట్ను సిద్ధం చేయండి. ఈ మిశ్రమాన్ని చర్మంపై గుండ్రంగా మసాజ్ చేసి ముఖంపై 10 నిమిషాల పాటు ఉంచుకుని తర్వాత శుభ్రం చేసుకోండి.

బియ్యం పిండి, పెరుగు: ఒక గిన్నెలో 5 స్పూన్ల బియ్యప్పిండి తీసుకోండి. దీనికి కాస్త పెరుగు జోడించండి. ఈ మిశ్రమాన్ని చర్మం.. మెడపై అప్లై చేసి కాసేపు మసాజ్ చేసిన తర్వాత తొలగించండి. ఈ రైస్ స్క్రబ్ మీ ముఖంపై సహజమైన మెరుపును తెస్తుంది.