
బక్రీద్ పండుగ రోజును అందరూ ఇంట్లో ఉండి అన్ని రకాలు వంటలు చేసుకుని ఆస్వాదించే ప్రత్యేక రోజు. ఇక ఈ పండుగ రోజున ఎంతో మంది ఇష్టంగా తినే లిస్ట్ లో మటన్ కూడా ఉంటుంది. అయితే, దీనిని పల్లెటూరి స్టైల్ చేసి తింటే ఆ క్రేజ్ వేరబ్బా. ఇంకా ప్రత్యేక మసాలాలతో మసాలా మటన్ ఫ్రై చేస్తే ఒక ప్లేట్ తినేవాళ్లు రెండు ప్లేట్స్ తింటారు.

పల్లెటూరి స్టైల్ మసాలా మటన్ ఫ్రై కావాల్సిన పదార్థాలు: కేజీ మటన్, మూడు ఉల్లిపాయలు, రెండు ఉల్లిపాయలు, టమోటాలు మూడు, రెండు టేబుల్ స్పూన్స్ కారం , ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి , ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా , చిటికెడు పసుపు, కరివేపాకు, అర కట్ట కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు , అర కప్పు నూనెను తీసుకోవాలి.

పల్లెటూరి స్టైల్ మసాలా మటన్ ఫ్రై తయారి విధానం: ముందుగా మటన్ను తీసుకుని దానిని బాగా కడిగి అర టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్తో ముక్కలను బాగా మ్యారినేట్ చేసి అలా కొద్దిసేపు దానిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్లో మటన్ను వేసి దీనిని మెత్తగా ఉడికించాలి.

అలాగే, పాన్లో ఆయిల్ వేసి దానిలో కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వచ్చే వరకు దీనిని బాగా వేయించాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా నాలుగు టమోటాలు వేసి వీటిని బాగా మగ్గించాలి. ఆ తరువాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి.

ఇంకా దీనిలో ఉడికించిన మటన్ కూడా వేసి మీడియం మంటపై నూనె వేసి బాగా వేయించాలి. ఇంకా దీనిలో కరివేపాకు, కొత్తిమీర కూడా చల్లి వేడి వేడిగా వీటిని సర్వ్ చేసుకోవాలి. ఆ తర్వాత చెక్క, లవంగం, నాలుగు యాలకులు దీనిలో వేస్తె పల్లెటూరి ఫ్లేవర్ కు ఇంకా మంచి రుచి వస్తుంది. ఇంకా చివర్లో కొద్దిగా ఆయిల్ వేస్తే టేస్ట్ సూపర్.