
కావాల్సిన పదార్దాలు: అర కిలో చికెన్, ఆవకాయ నూనె, మామిడికాయ ముక్కలు, రెండు పెద్ద ఉల్లిపాయలు, ఉల్లిపాయలు రెండు పెద్ద టమాటాలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు , ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పు, కరివేపాకు ఆకులు, నూనె రెండు టేబుల్ స్పూన్లు , కొత్తిమీర ఆకులు తీసుకోవాలి.

ముందుగా చికెన్ ముక్కలను తీసుకుని ఉప్పుతో బాగా క్లీన్ చేసుకుని బాగా శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత వాటికి కొద్దిగా నిమ్మరసం, పెరుగును పట్టించి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో ఊరగాయ ఆయిల్ వేసి దానిలో అర టీ స్పూన్ జీలకర్ర, పది ఎండుమిర్చి, పది కరివేపాకు ఆకులు , ఉల్లిపాయలు ,టమాటాలు వేసి అవి మగ్గే వరకు స్టవ్ మీదే ఉంచి బాగా వేయించాలి.

ఇక ఇప్పుడు టమాటా ముక్కలు తీసుకుని వాటిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం, సాల్ట్ కూడా వేసి వాటిని బాగా వేయించాలి. ఆ తర్వాత చింతపండు రసం, ఒక గ్లాస్ నీళ్లు పోసి స్టవ్ మీదే ఉంచి ఉడికించుకోవాలి.

ఉడుకుతున్న పులుసులో ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను, మామిడి ముక్కలను ఈ మిశ్రమంలో వేసి మూత పెట్టి సన్నని మంటపై వాటిని బాగా ఉడికించాలి. చివర్లో కొత్తిమీర వేసి వేడి వేడి అన్నంలో తినడమే.