
సపోటా పండులో పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిని మనం రోజూ తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల సులభంగా బయట పడొచ్చు.

సపోటాను మీ ఫుడ్ లో భాగంగా తీసుకోవడం వల్ల ప్రాణాంతక సమస్యలకీ కూడా చెక్ పెట్టొచ్చు. ఎందుకంటే, దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సపోటాను వారంలో మూడు సార్లు తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాదు, జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుంది.

ఇంకా సపోటాలో పొటాషియం, మెగ్నీషియం వంటి విలువైన పోషకాలు ఉన్నాయి. ఇవి రక్తప్రసరణను కూడా మెరుగుపరుస్తాయి. అంతేకాదు, గుండె పోటును రాకుండా చేసి దానిని మెరుగుపరచడంలో ఇది మనకు ఎంతగానో సహాయపడుతుంది.

కళ్ల సమస్యలతో బాధ పడే వారికీ ఇది ఎంతో మేలు చేస్తుంది. సపోటాలో ఉండే విటమిన్ ఇ చర్మ సమస్యలకు చెక్ పెడుతుంది. అంతే, విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది.

సపోటా పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ శక్తి పెరుగుతుంది. దీనిలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నీరసం, అలసట సమస్యను తగ్గించి శక్తిని ఇస్తుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)