నల్లగా ఉన్నాయని తీసిపారేయకండి.. ఇది సుగంధ ద్రవ్యాల రాజు..రోజూ వాడితే ఈ వ్యాధులకు చెక్..!

|

Jul 29, 2024 | 6:27 PM

మన దేశంలో ప్రతి వంటింట్లో తప్పక ఉండే సుగంధ ద్రవ్యాలలో నల్ల మిరియాలు ఒకటి. ఇవి రుచిలో ఘాటుగా ఉండి ఆహారానికి రుచి, ఆరోగ్యాన్ని అందిస్తాయి. నల్ల మిరియాలలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫ్లేవనాయిడ్స్, కెరోటిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే.. ఆహారంలో వీటిని తప్పనిసరిగా వాడాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో ఈ నల్లమిరియాల వల్ల సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా ఉండేలా చేస్తుంది.

1 / 5
నల్ల మిరియాల వాడకంతో జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. శరీరంలోని టేస్ట్ బడ్స్‌ను యాక్టివేట్ చేస్తాయి. తద్వారా జీర్ణప్రక్రియ వేగంగా జరుగుతుంది. పేగులను శుభ్రపరిచి జీర్ణసంబంధ సమస్యలనూ మిరియాలు నివారిస్తాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫ్లాట్యులెన్స్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఇందులో ఉన్నాయి. ఈ లక్షణాల వల్ల, శరీరంలోని జీర్ణవ్యవస్థ, రోగనిరోధక శక్తి చాలా రకాలుగా మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. మీరు టీ, డికాషన్, బరువు తగ్గించే పానీయం తయారు చేసి తాగవచ్చు.

నల్ల మిరియాల వాడకంతో జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. శరీరంలోని టేస్ట్ బడ్స్‌ను యాక్టివేట్ చేస్తాయి. తద్వారా జీర్ణప్రక్రియ వేగంగా జరుగుతుంది. పేగులను శుభ్రపరిచి జీర్ణసంబంధ సమస్యలనూ మిరియాలు నివారిస్తాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫ్లాట్యులెన్స్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఇందులో ఉన్నాయి. ఈ లక్షణాల వల్ల, శరీరంలోని జీర్ణవ్యవస్థ, రోగనిరోధక శక్తి చాలా రకాలుగా మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. మీరు టీ, డికాషన్, బరువు తగ్గించే పానీయం తయారు చేసి తాగవచ్చు.

2 / 5
ఇందులో ఉండే పైపెరిన్, యాంటీ ఒబెసిటీ గుణాలు శరీర బరువును తగ్గించడంలో ఎంతగానో సహకరిస్తాయి. అలాగే, నువ్వుల నూనెను వేడి చేయండి. అందులో నల్లమిరియాలు వేసి చల్లార్చండి. ఈ నూనెతో కీళ్ల నొప్పుల ప్రాంతంలో మర్దన చేస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. నెయ్యి, నల్ల మిరియాలు క్రమం తప్పకుండా తీసుకుంటే డయాబెటిస్, కీళ్ల నొప్పులు, మెడ నొప్పి, మోకాళ్ల నొప్పుల వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

ఇందులో ఉండే పైపెరిన్, యాంటీ ఒబెసిటీ గుణాలు శరీర బరువును తగ్గించడంలో ఎంతగానో సహకరిస్తాయి. అలాగే, నువ్వుల నూనెను వేడి చేయండి. అందులో నల్లమిరియాలు వేసి చల్లార్చండి. ఈ నూనెతో కీళ్ల నొప్పుల ప్రాంతంలో మర్దన చేస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. నెయ్యి, నల్ల మిరియాలు క్రమం తప్పకుండా తీసుకుంటే డయాబెటిస్, కీళ్ల నొప్పులు, మెడ నొప్పి, మోకాళ్ల నొప్పుల వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

3 / 5
పసుపు, మిరియాల పొడిని పాలలో కలుపుకుని తాగడం వల్ల తీవ్రమైన జలుబు సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, కెరోటినాయిడ్స్ ఉంటాయి. ఇది క్యాన్సర్, అనేక వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది. ఇది కాకుండా, మీరు నల్ల మిరియాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే శరీరం సహజంగా ఫిట్‌గా ఉంటుంది. నల్ల మిరియాల పొడి, నల్ల ఉప్పు, నిమ్మరసం కలిపి తాగితే గ్యాస్, ఎసిడిటీ సమస్యల నుండి తక్షణ ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.

పసుపు, మిరియాల పొడిని పాలలో కలుపుకుని తాగడం వల్ల తీవ్రమైన జలుబు సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, కెరోటినాయిడ్స్ ఉంటాయి. ఇది క్యాన్సర్, అనేక వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది. ఇది కాకుండా, మీరు నల్ల మిరియాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే శరీరం సహజంగా ఫిట్‌గా ఉంటుంది. నల్ల మిరియాల పొడి, నల్ల ఉప్పు, నిమ్మరసం కలిపి తాగితే గ్యాస్, ఎసిడిటీ సమస్యల నుండి తక్షణ ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.

4 / 5
అన్ని ఆహారాలలో చిటికెడు నల్ల మిరియాల పొడిని వాడాలని సూచిస్తున్నారు.. దీంతో అనేక రకాల పొట్ట సమస్యలు తీరిపోతాయి.. రోజూ ఆహారంలో కొద్దిగా నల్లమిరియాల పొడిని కలిపి తింటే మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవు. ఏదైనా సరే మితంగా తింటేనే మంచిది.. లేదంటే దుష్ప్రభావాలు తప్పవు. మంచివే కదా అని మోతాదుకు మించి మిరియాలు తింటే జీర్ణ సమస్యలతోపాటు నోరు, గొంతులో మంట వంటి ఇబ్బందులు వస్తాయి.

అన్ని ఆహారాలలో చిటికెడు నల్ల మిరియాల పొడిని వాడాలని సూచిస్తున్నారు.. దీంతో అనేక రకాల పొట్ట సమస్యలు తీరిపోతాయి.. రోజూ ఆహారంలో కొద్దిగా నల్లమిరియాల పొడిని కలిపి తింటే మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవు. ఏదైనా సరే మితంగా తింటేనే మంచిది.. లేదంటే దుష్ప్రభావాలు తప్పవు. మంచివే కదా అని మోతాదుకు మించి మిరియాలు తింటే జీర్ణ సమస్యలతోపాటు నోరు, గొంతులో మంట వంటి ఇబ్బందులు వస్తాయి.

5 / 5
మిరియాలలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. విటమిన్‌-ఎ, సి కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలోని వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.  పాలలో మిరియాలపొడి, పసుపు, శొంఠి వేసుకుని కషాయంలా మరిగించి..  నిద్రపోయే ముందు తాగితే ఊపిరితిత్తుల సమస్యలు ఉండవంటున్నారు నిపుణులు. అధిక బరువు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఒక గ్లాసుడు నీటిలో నల్ల మిరియాల నూనెను కలిపి తీసుకుంటే మంచిది. క్రమం తప్పకుండా ఇలా చేస్తే త్వరలోనే మీ బరువు సమస్యను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

మిరియాలలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. విటమిన్‌-ఎ, సి కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలోని వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. పాలలో మిరియాలపొడి, పసుపు, శొంఠి వేసుకుని కషాయంలా మరిగించి.. నిద్రపోయే ముందు తాగితే ఊపిరితిత్తుల సమస్యలు ఉండవంటున్నారు నిపుణులు. అధిక బరువు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఒక గ్లాసుడు నీటిలో నల్ల మిరియాల నూనెను కలిపి తీసుకుంటే మంచిది. క్రమం తప్పకుండా ఇలా చేస్తే త్వరలోనే మీ బరువు సమస్యను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.