
సెప్టెంబర్ 11 అమావాస్య, ఈ రోజున చంద్రుడు సింహ రాశి నుంచి కన్యా రాశిలోకి సంచారం చేస్తుంటాడు. అయితే ఇదే సమయంలో శని విష యోగాన్ని ఏర్పరుస్తుంది. దీని వలన పన్నెండు రాశుల్లో మూడు రాశుల వారికి ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. అంతే కాకుండా అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కుంటారు. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

సింహ రాశి : సింహ రాశి వారు అమావాస్య నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు అనేక ఇబ్బందులు ఎదుర్కునే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. చాలా రోజుల నుంచి మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా నిరాశే ఎదురవుతుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అప్పుల బాధలు అధికం అవుతాయి.

తుల రాశి : తుల రాశి వారికి కూడా ఆర్థిక పరమైన కష్టాలు అధికం అవుతాయి. చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఆదాయం తగ్గుతుంది. బంధువుల నుంచి మాట పట్టింపులు ఎదురు అయ్యే ఛాన్స్ ఉంది. అందువలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేసినా, ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయడం ఉత్తమం.

కుంభ రాశి : కుంభ రాశి వారు మానసికంగా కుంగిపోతుంటారు. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా అదే రీతిలో ఉంటాయి. దీంతో ఈ రాశి వారు ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగం లభించదు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు