‘సరిలేరు నీకెవ్వరు’కి గెస్ట్గా మెగాస్టార్.. ‘అల’కు వద్దన్న బన్నీ!
సంక్రాంతి కానుకగా.. ఈనెల రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ పండుగకు ఇద్దరు స్టార్ హీరోలకు మధ్య పోటీ నెలకొంది. ఒకటి మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ ఈ నెల 11కి రిలీజ్ కానుండగా.. మరొకటి అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురం’ 12కి రిలీజ్ అవుతోంది. దీంతో.. ముందుగానే సరిలేరు నీకెవ్వరు మూవీ టీం.. ప్రీ రిలీజ్ ఈవెంట్ని గ్రాండ్గా చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకాబోతున్నారు. అయితే.. ఇదే […]
సంక్రాంతి కానుకగా.. ఈనెల రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ పండుగకు ఇద్దరు స్టార్ హీరోలకు మధ్య పోటీ నెలకొంది. ఒకటి మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ ఈ నెల 11కి రిలీజ్ కానుండగా.. మరొకటి అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురం’ 12కి రిలీజ్ అవుతోంది. దీంతో.. ముందుగానే సరిలేరు నీకెవ్వరు మూవీ టీం.. ప్రీ రిలీజ్ ఈవెంట్ని గ్రాండ్గా చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకాబోతున్నారు. అయితే.. ఇదే సమయంలో రిలీజ్ కాబోతున్న ‘అల వైకుంఠపురం’ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మాత్రం గెస్ట్ ఎవరూ రావడంలేదట.
అంతేకాదు.. ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్లు ఎవరూ వద్దని బన్నీ ఇప్పటికే దర్శక నిర్మాతలకు చెప్పేశాడని సమాచారం. ఎందుకంటే.. టాలీవుడ్లో మెగాస్టార్ని మించిన గెస్ట్ లేరని బన్నీ అభిప్రాయమట. అంతేకాదు.. ఇంకెవరినైనా పిలిచినా ఆయన్ని అవమానించినట్టు అవుతుందని బన్నీ సందేహం. దీంతో.. ఎవరినీ పిలవకుండానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.