చైనా, హాంకాంగ్ల నుంచి హైదరాబాద్ చేరిన 45 మంది: వైద్య శాఖ అప్రమత్తం
కరోనా వైరస్తో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కేంద్రం ఆదేశాల మేరకు కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పలువురు జ్వరాల బారిన పడ్డారు. అలాగే.. ఈ వైరస్ సోకి భారతదేశంలో ఒకరు మరణించారు. తాజాగా.. కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతూ ఓ యువకుడు(29) ఫీవర్ ఆస్పత్రిలో చేరగా, మియాపూర్కు చెందిన మరో వ్యక్తి (39) కూడా గాంధీ ఆస్పత్రిలో చేరాడు. […]
కరోనా వైరస్తో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కేంద్రం ఆదేశాల మేరకు కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పలువురు జ్వరాల బారిన పడ్డారు. అలాగే.. ఈ వైరస్ సోకి భారతదేశంలో ఒకరు మరణించారు. తాజాగా.. కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతూ ఓ యువకుడు(29) ఫీవర్ ఆస్పత్రిలో చేరగా, మియాపూర్కు చెందిన మరో వ్యక్తి (39) కూడా గాంధీ ఆస్పత్రిలో చేరాడు. దీంతో.. వైద్య శాఖ అప్రమత్తమయ్యింది. బాధితులను కరోనా ఐసోలేషన్ వార్డులో అడ్మిట్ చేసి వైద్యసేవలు అందిస్తున్నారు. వారి నుంచి రక్త నమూనాలు సేకరించి పుణేలోని వైరాలజీ ల్యాబ్కు పంపించారు.
కాగా.. చైనా, హాంకాంగ్ల నుంచి హైదరాబాద్కి వచ్చినవారిపై ఆరోగ్య శాఖ ఆరా తీసింది. జనవరి 15 తర్వాత చైనా, హాంకాంగ్ నుంచి దాదాపు 45 మంది హైదరాబాద్కి చేరుకున్నారు. వీరిని గుర్తించిన తెలంగాణ ఆరోగ్య సంక్షేమ శాఖ అధికారులు.. తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని నోటీసులు ఇచ్చారు. గాంధీ ఆస్పత్రి వైరాలజీకి రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. చైనా దేశం నుంచి జనవరి 15 తర్వాత వచ్చిన వాళ్ళందరూ సెల్ఫ్ ఐసొల్యూషన్లో ఉండి సహకరించాలని తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేసింది.