‘ఎందుకు దాక్కుంటున్నారు?.. మోదీపై రాహుల్ ఫైర్

భారత-చైనా దళాల మధ్య ఘర్షణ జరిగి 20 మంది భారతీయ సైనికులు మరణించినప్పటికీ.. ప్రధాని మోదీ మౌనంగా ఎందుకు ఉంటున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఆయన సైలెంట్ గా ఎందుకు ఉంటున్నారని..

'ఎందుకు దాక్కుంటున్నారు?.. మోదీపై రాహుల్ ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 17, 2020 | 12:33 PM

భారత-చైనా దళాల మధ్య ఘర్షణ జరిగి 20 మంది భారతీయ సైనికులు మరణించినప్పటికీ.. ప్రధాని మోదీ మౌనంగా ఎందుకు ఉంటున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఆయన సైలెంట్ గా ఎందుకు ఉంటున్నారని, ఎందుకు ‘దాక్కుంటున్నారని’ ట్వీట్ చేశారు. అసలు ఏం జరిగిందో తాము తెలుసుకోదలిచామని, మన సైనికులను హతమార్చడానికి, మన భూభాగాలను చేజిక్కించుకోవడానికి వారికెంత ధైర్యమని అన్నారు. ఘర్షణల్లో మృతి చెందిన భారత సైనికుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ రాహుల్ ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. మీరు బయటికి వఛ్చి వాస్తవమేమిటో చెప్పాలని, భయపడవద్దని ఆయన అన్నారు. భారత సైనికులు ఇరవై మంది మరణించగా.. 43 మంది చైనా సైనికులు గాయపడడమో,  మరణించడమో జరిగిందని ఎఎన్ఐ వార్తా సంస్థ ప్రకటించినప్పటికీ  భారత సైన్యం మాత్రం ఈ అంశాన్ని నిర్దిష్టంగా ప్రస్తావించలేదు.

గాల్వాన్ వ్యాలీలో మన సైనికులు ఇరవై మంది మృతి చెందినట్టు వఛ్చిన వార్త తమను షాక్ కి గురి చేసిందని, అమరులైన వారికి సెల్యూట్ చేస్తున్నామని, ప్రధాని మోదీ దేశ ప్రజలను విశ్వాసం లోకి తీసుకోవాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ ట్వీట్ చేశారు. చైనాకు దీటైన సమాధానం ఇవ్వాల్సిందే అన్నారు. కాగా-బీజేపీ చీఫ్ జె.పి. .నడ్డా.. కేరళలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ.. చైనా సైనికులను మన సైన్యం ధాటిగా ఎదుర్కొందని, ప్రధాని మోదీ నాయకత్వం కింద భారత ప్రాదేశిక సమగ్రతను పణంగా పెట్టే ప్రసక్తి లేదన్నారు.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..