పుల్వామాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్టుల హతం

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో శుక్రవారం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామాలోని పాంపొరే ప్రాంతం లాల్‌పొరా గ్రామంలో ముష్కరుల వచ్చినట్లుగా సమాచారం అందుకున్న భద్రతా..

పుల్వామాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్టుల హతం
Follow us

|

Updated on: Nov 06, 2020 | 8:42 PM

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో శుక్రవారం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామాలోని పాంపొరే ప్రాంతం లాల్‌పొరా గ్రామంలో ముష్కరుల వచ్చినట్లుగా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కూబింగ్‌ నిర్వహించారు.

ఓ ఇంట్లో దాక్కున్న టెర్రరిస్టు పోలీసుల రాకను గమనించిన కాల్పులకు తెగబడ్డారు. దీంతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడిక్కడే హతమయ్యారు. అందులోని ఓ ఉగ్రవాది జవాన్లకు లొంగిపోయాడు.

ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు పాకిస్తాన్‌కు చెందినవారిగా స్థానిక పోలీసులు గుర్తించారు. లొంగిపోయిన ఉగ్రవాది స్థానికుడని తెలిపారు. వారి వద్ద నుంచి తుపాకులు, పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో స్థానిక ఉగ్రవాది లొంగిపోయాడని స్థానిక పోలీసు అధికారులు వెల్లడించారు. అయితే ఆపరేషన్‌ కొనసాగుతోందని కశ్మీర్‌ పోలీసులు తెలిపారు.

పాంపొరే ప్రాంతంలో గురువారం సైతం ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. కట్టడిముట్టడికి వెళ్లిన సెక్యూరిటీ బలగాలపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు గాయపడ్డారు. సెక్యూరిటీ సిబ్బంది ఓ ఉగ్రవాదిని హతమార్చారు.