ఏనుగును చంపినవారిపై కఠిన చర్యలు.. కేరళ సీఎం పినరయి విజయన్

| Edited By: Pardhasaradhi Peri

Jun 03, 2020 | 7:44 PM

కేరళలోని మళప్పురంలో గర్భంతో ఉన్న ఏనుగు మృతికి కారకులైనవారిపై కఠిన చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. ఈ కేసును పోలీసులతో బాటు..

ఏనుగును చంపినవారిపై కఠిన చర్యలు.. కేరళ సీఎం పినరయి విజయన్
Follow us on

కేరళలోని మళప్పురంలో గర్భంతో ఉన్న ఏనుగు మృతికి కారకులైనవారిపై కఠిన చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. ఈ కేసును పోలీసులతో బాటు అటవీ శాఖ కూడా దర్యాప్తు చేస్తోందని ఆయన ట్వీట్ చేశారు. కిల్లర్స్ ను త్వరలో అరెస్టు చేస్తామన్నారు. క్రాకర్స్ తో కూడిన పైన్ యాపిల్ ని తినిపించడంతో ఈ గజరాజు తీవ్రంగా గాయపడి మరణించింది. తన గాయం నుంచి కొంతవరకైనా ఊరట పొందేందుకు వెల్లియార్ నదిలో చాలాసేపు నిలబడి చివరకు ప్రాణాలు కోల్పోయింది. దీని మృతికి కారకులైనవారు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ గజరాజం  కడుపులోని బిడ్డ ..’అమ్మా ! నేను మనుషులను చూడలేను.. కానీ నువ్వు చూడగలిగావు’ అని అంటున్నట్టు… పలువురు గీసిన క్యారికేచర్లు వైరల్ అవుతున్నాయి.  ఏనుగు మరణం తనను తీవ్రంగా కలచివేసిందని, ఈ అమానుషానికి పాల్పడినవారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని  కోరుతూ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. ఈ ఏనుగు మనుషులను నమ్మి పొరబాటు చేసిందని వివేక్ రంజన్ అగ్నిహోత్రి కూడా ట్వీట్ చేశారు.

&