Coronavirus: విషాద ఘటన… కరోనాతో తండ్రి మృతి.. చితిలో దూకిన కుమార్తె
కరోనా సెకండ్ వేవ్ తో దేశం అతలాకుతలం అవుతోంది. చాలా మంది కోవిడ్ మహమ్మారి బారిన పడుతున్నారు. మహమ్మారికి.....
కరోనా సెకండ్ వేవ్ తో దేశం అతలాకుతలం అవుతోంది. చాలా మంది కోవిడ్ మహమ్మారి బారిన పడుతున్నారు. మహమ్మారికి అనేక మంది బలౌతున్నారు. కొన్ని సందర్భాల్లో కడచూపు కూడా కరువౌతోంది. కరోనా భయంతో ఇంకొంతమంది బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి. తాజాగా రాజస్థాన్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా కన్న తండ్రి మరణించాడన్న మనస్తాపంతో ఆయన చితిలోనే దూకి ఆత్మహత్యాయత్నం చేసింది ఓ యువతి. ఇప్పుడు తీవ్ర ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన ఇండియా – పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న బార్మెర్ జిల్లా రాయ్ కాలనీలో జరిగింది.
రాయ్ కాలనీకి చెందిన దామోదర్ దాస్ అనే వ్యక్తి కరోనా సోకి మరణించాడు. అతని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన స్థానిక పంచాయతీ సిబ్బంది, కుమార్తెలు, ఇతర బంధువుల సమక్షంలో చితికి నిప్పంటించారు. ఆ వెంటనే, దామోదర్ దాస్ కుమార్తె శారద చితిపైకి ఉరికింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్తిన్నారు. వెంటనే తేరుకున్న బంధుమిత్రులు, ఆమెను చితమంటల్లోంచి బయటకు లాగేశారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. 70 శాతం పైగా కాలిన గాయాలతో బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Also Read: ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. పెట్రో ధరల బాదుడు షురూ.. అసలేం జరుగుతోందంటే..!