రైతు చట్టాలకు నిరసన, పంజాబ్ సందర్శించనున్న రాహుల్ గాంధీ

| Edited By: Pardhasaradhi Peri

Oct 04, 2020 | 11:13 AM

రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆదివారం పంజాబ్ లో జరగనున్న నిరసన ప్రదర్శనల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరి కొద్దిసేపట్లో ఆ రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. ఖేతీ బచావో యాత్ర..

రైతు చట్టాలకు నిరసన, పంజాబ్ సందర్శించనున్న రాహుల్ గాంధీ
Follow us on

రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆదివారం పంజాబ్ లో జరగనున్న నిరసన ప్రదర్శనల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరి కొద్దిసేపట్లో ఆ రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. ఖేతీ బచావో యాత్ర పేరిట జరిగే బహిరంగ సభలు, సంతకాల సేకరణ వంటి ఉద్యమాల్లో ఆయన పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. నేడు లూధియానాలో జరగనున్న ట్రాక్టర్ ర్యాలీలో కూడా రాహుల్ పార్టిసిపేట్ చేస్తారని ఈ వర్గాలు పేర్కొన్నాయి. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సునీల్ జఖర్ .ఇతర నేతలు కూడా ఈ ఆందోళనా కారక్రమాల్లో పాల్గొంటారు. మూడు రోజులపాటు ఈ నిరసనలు కొనసాగనున్నాయి.