
నియోజకవర్గాల పునర్విభజన అంటూ జరిగితే మోస్ట్ ఎఫెక్టెడ్ స్టేట్స్ మనమే.. నాతో కలసిరండి పోరాడతాం.. ఢిల్లీని బెదరగొడదాం.. అంటూ సదరన్ స్టేట్స్ వైపు చెయ్యి చాచి, ఏకంగా రౌండ్టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి.. కేంద్రంపైకి దండయాత్రకు దిగారు తమిళనాడు సీఎం స్టాలిన్. సరిగ్గా ఏడాది కిందటి విషయం ఇది. డీలిమిటేషన్ను అడ్డుకోవాలని ఆయన చేసిన వీరప్రయత్నం అప్పట్లో చప్పున చల్లారిపోయింది. దక్షిణాది రాష్ట్రాల చాంపియన్ అనే క్రెడిట్ టెంపరరీగానే మిలిగిపోయింది. కానీ, ఇప్బుడు అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెంచుకుందాం రా అని కేంద్రం ఇచ్చిన ఇన్డైరెక్ట్ పిలుపుతో.. డీలిమిటేషన్ మంట మళ్లీ రాజుకుంది. పూర్తిగా పోలింగ్ సందట్లో మునిగిపోయిన స్టాలిన్, పునర్విభజన టాపిక్ వైపే చూడ్డం మానేశారు. ఎందుకంటే, అది పక్కా పొలిటికల్ పార్టీల బతుకు ప్రశ్న. వాళ్ల ఫుడ్డుకు సంబంధించిన ఇష్యూ. అంతేతప్ప, పాపులర్ స్లోగన్ కాదు. అందుకే, ఇప్పుడున్న నియోజకవర్గాల్లో విజయఢంకా మోగించడంపైనే ఆయన ఫోకస్ అంతా. తర్వాత పెరగబోయే నియోజకవర్గాల సబ్జెక్ట్ని చాలా లైట్ తీస్కున్నారు. కానీ, ఎన్నికలతో సంబంధం లేని మిగతా రాష్ట్రాలు మాత్రం ఎటెన్షన్లోకొచ్చేశాయి. టేకిటీజీ వద్దు, మేటర్ వెరీ సీరియస్ అంటున్నాయి. కేంద్రం సూత్రప్రాయంగా మొదలుపెట్టిన డీలిమిటేషన్ ప్రాక్టీస్ను అడ్డంగా తిప్పికొట్టేస్తున్నాయి. మోదీ సర్కార్ మాత్రం ముందుకే చూస్తోంది. ...