మళ్లీ రెచ్చిపోయిన పాక్.. సరిహద్దు వెంట కాల్పులు
పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. నిత్యం సరిహద్దు వెంట కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. కాల్పులకు దిగుతోంది. పూంచ్ ప్రాంతంలోని మాన్కోటే సెక్టార్ సరిహద్దు..
పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. నిత్యం సరిహద్దు వెంట కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. కాల్పులకు దిగుతోంది. పూంచ్ ప్రాంతంలోని మాన్కోటే సెక్టార్ సరిహద్దు మీదుగా కాల్పులకు దిగింది. శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు చిన్నచిన్న ఆయుధాలతో పాటు.. మోర్టార్ షెల్స్తో దాడులకు దిగింది. వెంటనే అప్రమత్తమైన సైన్యం.. పాక్కు ధీటుగా ఎదురుకాల్పులు చేపట్టింది. కాగా, గత కొద్ది రోజులుగా నిత్యం పాక్ కాల్పుల విరిమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. కాల్పులకు దిగుతోంది. ఈ క్రమంలో సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు భయం గుప్పిట్లో జీవిస్తున్నారు.
Jammu and Kashmir: Pakistan violated ceasefire by firing with small arms & intense shelling with mortars along LoC in Mankote Sector of Poonch District at about 1830 hours, today. Indian Army is retaliating.
— ANI (@ANI) August 21, 2020