Metro Pillar Collapse: చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్.. పలు వాహనాలు ధ్వంసం!

దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముల్లుంద్‌ వెస్ట్‌లో నిర్మాణంలో ఉన్న మెట్రో స్టేషన్‌ పిల్లర్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Metro Pillar Collapse: చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్.. పలు వాహనాలు ధ్వంసం!
Mumbai Metro Pillar Collapse

Updated on: Feb 14, 2026 | 6:15 PM

దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముల్లుంద్‌ వెస్ట్‌ ప్రాంతంలోని నిర్మాణంలో ఉన్న మెట్రో స్టేషన్‌ పిల్లర్ ఒక్కసారిగా కూలిపోయింది. రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆటో, కారు, బైక్‌ సహా పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. పిల్లర్ ఒక్కసారిగా వాహనాలపై పడిపోవడంతో వాహానాల్లో ఉన్న ప్రయాణికులు అందులోనే ఇరుక్కుపోయారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసుసులు, రెస్క్యూ సిబ్బంది శిథిలా కింద చిక్కుకున్న క్షతగాత్రులను బటయకు తీసి చికిత్స నిమిత్తం అంబులెన్సై్ సహాయంతో స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో ఆటోలో వెళ్తున్న నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్టు అధికారులు తెలిపారు. అనంతరం క్రెయిన్ సహాయంతో పిల్లర్ శిథిలాలను వాహనాలపై నుంచి తొలగించారు. అలాగే రొడ్డుపై ఉన్న వాహనాలను తొలగించి. ప్రమాదం కారణంగా ఆగిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్‌ కూడా అచ్చం ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఆగ్రా మెట్రో నిర్మాణం పనుల్లో ప్రమాదం జరిగింది. డ్రిల్లింగ్‌ మిషన్‌ క్రేన్‌ పక్కనే ఉన్న భవనాలపై కూలింది. ఈ ప్రమాదంలో లిక్కర్‌ షాప్‌ ధ్వంసమయ్యిది. ఓ ఇళ్లు కూడా ధ్వంసమయ్యింది. అయితే ప్రమాద సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మెట్రో అధికారులు ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us