జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని రామ్ పూర్ సెక్టార్ లో భారత దళాలు నిన్నటి నుంచి ఈ ఉదయం తెల్లవారుజామున 5 గంటలవరకు విస్తృత సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో పలు చోట్ల అనుమానిత ఉగ్రవాదులు దాచిన పలు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి బయటపడింది. వీటిలో ఏకే సిరీస్ రైఫిళ్లు, పిస్టళ్లు, తొమ్మిది మేగజైన్లు, 21 గ్రెనేడ్లు, యాంటెన్నాతో కూడిన రేడియో సెట్లు ఉన్నాయి. ఉగ్రవాదులతో బాటు సంఘ వ్యతిరేక శక్తులు కూడా వీటిని దాచి ఉంచి సమయం కోసం ఎదురు చూస్తున్నారని, వీటితో తమపై దాడులకు దిగాలన్నదే వారి ఉద్దేశంగా కనిపిస్తోందని సైనిక వర్గాలు తెలిపాయి. మొత్తం ఏడెనిమిది గంటలపైగా విస్తృతంగా జరిపిన తనిఖీలు, సోదాల్లో ఇవి బయట పడినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి.