‘కరోనా.. హైరానా’.. ఇరాన్ నుంచి తిరిగి వఛ్చిన 58 మంది భారతీయులు.

| Edited By: Anil kumar poka

Mar 10, 2020 | 12:16 PM

కరోనా వైరస్ తో సతమతమవుతున్న ఇరాన్ దేశం నుంచి 58 మంది భారతీయులు క్షేమంగా ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్ చేరుకున్నారు. భారత వైమానిక దళానికి చెందిన సీ-17 విమానంలో వీరంతా స్వదేశానికి చేరుకున్నట్టు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు..

కరోనా.. హైరానా.. ఇరాన్ నుంచి తిరిగి వఛ్చిన 58 మంది భారతీయులు.
Follow us on

కరోనా వైరస్ తో సతమతమవుతున్న ఇరాన్ దేశం నుంచి 58 మంది భారతీయులు క్షేమంగా ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్ చేరుకున్నారు. భారత వైమానిక దళానికి చెందిన సీ-17 విమానంలో వీరంతా స్వదేశానికి చేరుకున్నట్టు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు.. ‘మిషన్ కంప్లీట్’ అని ఆయన ట్వీట్ చేశారు. ఇరాన్ లో వందలాది భారతీయులు చిక్కుబడి ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ దేశంలో కరోనాకు గురై మరణించినవారి సంఖ్య 200 కు పెరిగింది. ఆ దేశం నుంచి భారతీయులను ఇక్కడికి చేర్చడం ఇది రెండోసారి. కాగా-గత నెల 27 న చైనా లోని వూహాన్ సిటీ నుంచి 76 మంది భారతీయులను భారత విమానంలో స్వదేశానికి చేర్చారు.

దేశంలో కరోనా కేసులు 47 కి పెరిగినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇరాన్ నుంచి జమ్మూ కాశ్మీర్ చేరుకున్న 63 ఏళ్ళ మహిళకు కోవిడ్-19 సోకినట్టు అనుమానిస్తున్నారు. అటు-వచ్ఛే వారం ప్రధాని మోదీ బంగ్లాదేశ్  పర్యటనకు వెళ్లనుండగా.. కరోనా కారణంగా ఆ టూర్ రద్దు చేసుకున్నారు. ఈ వైరస్ వల్ల గ్లోబల్ ఎకానమీకి ఈ ఏడాది 1.0- 2.0 ట్రిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లనుందని ఐక్యరాజ్యసమితికి చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారు.