
న్యూఢిల్లీ, ఆగస్టు 19: కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆది కర్మయోగి అభియాన్ను అధికారికంగా ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన గ్రాస్రూట్స్ లీడర్షిప్ ప్రోగ్రామ్. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల సాధికారత కల్పించడం, ప్రతిస్పందనాత్మక పాలనను బలోపేతం చేయడం, స్థానిక నాయకత్వ అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ దార్శనికతో ప్రారంభించిన ఈ పథకం ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ (సేవ, పరిష్కారం, సమర్పణ)’ అనే సూత్రాన్ని ప్రతిబింబించేలా రూపొందిచారు. ఈ చొరవ జనజాతీయ గౌరవ వర్ష్లో కీలకమైన భాగంకానుంది. 2047 నాటికి విక్షిత్ భారత్ నిర్మాణానికి ఇది దోహదపడుతుంది.
ఉపాధ్యాయులు, వైద్యులు, కమ్యూనిటీలకు మార్గదర్శకత్వం వహించేందుకు సహకరిస్తారు. అలాగే స్వయం సహాయక సంఘాలు, NRLM సభ్యులు, గిరిజన పెద్దలు, యువత, స్థానిక నాయకులు ఈ పథఖం అమలు, వ్యాప్తికి మద్దతు ఇస్తున్నారు. అలాగే గిరిజన యువత, మహిళలు, కమ్యూనిటీ నాయకులకు పాలన, సమస్య పరిష్కారం, సామాజిక సమీకరణపై కమ్యూనిటీ లీడర్షిప్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 550 జిల్లాల నుంచి దాదాపు లక్ష గిరిజన ప్రాబల్య గ్రామాలకు ఈ కార్యక్రమాలను చేరవేసేందుకు కృషి చేస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొన్ని విజయవంతమైన ప్రభుత్వ పథకాల అమలుపై ఆధారపడి ఉంటుంది. ఇందులో ధర్తి ఆబా జంజాటియ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకం, ప్రధాన మంత్రి జంజాటి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (PM JANMAN), జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ పథకాలు ముఖ్యమైనవి. దేశవ్యాప్తంగా గిరిజన నాయకత్వాన్ని, సమగ్ర అభివృద్ధిని బలోపేతం చేసేందుకు ఈ చారిత్రాత్మక చొరవలో చురుకుగా పాల్గొనాలని గిరిజన సంఘాలు, యువత, స్వయం సహాయక సంఘాలు, పౌర సమాజం, ప్రభుత్వ అధికారులకు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
ఆది కర్మయోగి అభియాన్ అనేది సమ్మిళిత పాలన, ప్రజల భాగస్వామ్యాన్ని సాధించడంలో ఓ చారిత్రాత్మక అడుగుగా గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ జువల్ ఓరం అభివర్ణించారు. సేవా, సంకల్ప్, సమర్పణ్లను పెంపొందించడం ద్వారా గిరిజన సంఘాలు, ప్రభుత్వ అధికారుల సహకారం ద్వారా 1 లక్ష గిరిజన గ్రామాల విజన్ 2030ని సృష్టిస్తామని అన్నారు. ఈ చొరవ అట్టడుగు స్థాయిలో ఉన్న గిరిజన అభివృద్ధికి పరివర్తన కలిగించే సామర్థ్యాన్ని కలిగిస్తుందని, మిషన్ మోడ్లో గిరిజన గ్రామాల సమగ్ర అభివృద్ధిని సాధించడంలో సహాయపడుతుందని గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయ్కే పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.