తమిళనాడులో ఇండియా కూటమికి షాక్.. కచ్చైతీవ్ సమస్యపై కాంగ్రెస్‎ను విమర్శించిన కీలక నేత..

|

Apr 03, 2024 | 10:09 PM

కచ్చైతీవ్ సమస్యకు కాంగ్రెస్ కారణమని ఎండీఎంకే నేత వైకో ఆరోపించారు. తమిళనాడును కాంగ్రెస్ ప్రతిసారి మోసం చేస్తూ వస్తోందని వైకో విమర్శించారు. ఏది ఏమైనప్పటికీ, ఎండీఎంకే నాయకుడు వైకో, ఇండియా ఫ్రంట్‌లో భాగమైనప్పటికీ.. కచ్చైతీవ్ అంశంపై కాంగ్రెస్‌ను విమర్శించడం రాజకీయంగా పెద్ద దుమారం రేగింది.

తమిళనాడులో ఇండియా కూటమికి షాక్.. కచ్చైతీవ్ సమస్యపై కాంగ్రెస్‎ను విమర్శించిన కీలక నేత..
Mdmk Founder Vaiko
Follow us on

చెన్నై, ఏప్రిల్ 03: కచ్చైతీవ్ సమస్యకు కాంగ్రెస్ కారణమని ఎండీఎంకే నేత వైకో ఆరోపించారు. తమిళనాడును కాంగ్రెస్ ప్రతిసారి మోసం చేస్తూ వస్తోందని వైకో విమర్శించారు. ఏది ఏమైనప్పటికీ, ఎండీఎంకే నాయకుడు వైకో, ఇండియా ఫ్రంట్‌లో భాగమైనప్పటికీ.. కచ్చైతీవ్ అంశంపై కాంగ్రెస్‌ను విమర్శించడం రాజకీయంగా పెద్ద దుమారం రేగింది. ఇదిలా ఉంటే గతంలో ప్ర‌ధాని మోడీ కూడా కచ్చైతీవ్ విష‌యంలో కాంగ్రెస్ తీరును నిందించారు. కాంగ్రెస్ ఉదాసీనత కారణంగానే తమిళనాడులోని రామనాథపురం సమీపంలో కచ్చైతీవ్ ప్రాంతాన్ని భారత్ కోల్పోయిందని తెలిపారు. 1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఒప్పందం ప్రకారం కచ్చైతీవ్‎ను శ్రీలంకకు అప్పగించారని ప్రధాని మోదీ చెప్పారు.

ఈ అంశంపై ప్రధాని మోడీని నిందించి తద్వారా ఇండియా ఫ్రంట్ తన అస్థిత్వాన్ని కాపాడుకోవాలని చూస్తున్నట్లుందని డీఎంకే నేతలు చెబుతున్న తరుణంలో, కచ్చైతీవ్‎పై వైకో కాంగ్రెస్‌‎ను విమర్శలు గుప్పించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైకో కుమారుడు దురై వైకో తిరుచ్చి లోక్‌సభ నియోజకవర్గానికి ఇండియా ఫ్రంట్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఈ తరుణంలో వైకో ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్న అనుమానాలు తమిళనాడు నాయకుల్లో కలుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

కచ్చైతీవ్ అంటే ఒక ప్రాంతం పేరు. ఇది ఒకప్పుడు తమిళనాడులో తీవ్రమైన రాజకీయ వివాదానికి తెర లేపింది. ఎందుకంటే కచ్చైతీవుపై శ్రీలంక యాజమాన్యం హక్కు పొందింది. ఆ తర్వాత కచ్చైతీవు తీరంలోని చేపల వేట కోసం తమిళ మత్స్యకారులను వెళ్లారు. అప్పుడు దీనిని అప్పటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరా గాంధీ శ్రీలంకేయులకు అప్పగించినట్లు కొందరు చెబుతున్నారు. పైగా అక్కడికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తమిళనాడు తీరంలోని ఈ కచ్చైతీవ్ ప్రాంతం శ్రీలంక నావికాదళం అదుపులోకి తీసుకునే పరిస్థితి నెలకొంది. అలా తమిళనాడు బీచ్‌లో చేపలు పట్టేందుకు వెళ్లే జాలర్లు ప్రాణాలు కోల్పోతూ వచ్చారు. అందుకే కాంగ్రెస్‎పై తమిళనాడు నాయకులకు కోపంగా ఉంటారు. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఉదాసీనంగా వ్యవహరించినందుకే ఇలాంటి పరిస్థితి నెలకొందని ఇప్పటికీ పలువురు విమర్శిస్తూనే ఉంటారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.