కర్నాటక అసెంబ్లీలో బలపరీక్షపై సీఎల్పీ నేత సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఇవాళ బలపరీక్ష జరిగే అవకాశం లేదని తేల్చి చెప్పారు. సోమవారం వరకు విశ్వాసపరీక్షపై చర్చ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. బలపరీక్షపై చర్చలో ఇంకా 20 మంది సభ్యులు మాట్లాడాల్సి ఉందన్నారు.