ఈ నెల 6 న భారత్-చైనా మధ్య సైనిక స్థాయి చర్చలు

| Edited By: Pardhasaradhi Peri

Jun 03, 2020 | 7:06 PM

భారత-చైనా మధ్య సైనిక స్థాయి చర్చలు ఈ శనివారం (ఈ నెల 6న) జరగనున్నాయి. లడఖ్ లోని 'ఛుషుల్-మోల్డో' లో గల బోర్డర్ పాయింట్ మీటింగ్ 'హట్' లో ఈ చర్చలు..

ఈ నెల 6 న భారత్-చైనా మధ్య సైనిక స్థాయి చర్చలు
Follow us on

భారత-చైనా మధ్య సైనిక స్థాయి చర్చలు ఈ శనివారం (ఈ నెల 6న) జరగనున్నాయి. లడఖ్ లోని ‘ఛుషుల్-మోల్డో’ లో గల బోర్డర్ పాయింట్ మీటింగ్ ‘హట్’ లో ఈ చర్చలు జరుగుతాయని సైనిక వర్గాలు తెలిపాయి. లడఖ్ వాస్తవాధీన రేఖ  వద్ద ఇటీవలి కాలంలో ఉభయ దేశాల దళాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో.. వీటి నివారణకు ఈ స్థాయి చర్చలు జరగాలని భారత్ కోరింది. ఇండియా తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ ఈ సంప్రదింపులకు నేతృత్వం వహించనున్నారని ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఈ చర్చలు సానుకూల ఫలితాలనిస్తాయని భావిస్తున్నారు. ఇప్పటివరకు ఇలా ప్రాంతీయ మిలిటరీ కమాండర్ల స్థాయిలో జరిగిన చర్చల వల్ల పెద్దగా పురోగతి సాధించలేకపోయామని భావిస్తున్నారు. 2017 లో డోక్లామ్ ప్రాంతంలో భారత, చైనా దళాల మధ్య ఘర్షణలు సుమారు 3 నెలల పాటు కొనసాగిన సంగతి విదితమే.