అటువైరం – ఇటు చెలిమి.. భారత్‌ – పాక్‌ మధ్య విచిత్ర “బంధం’ !

|

Aug 15, 2019 | 7:16 PM

భారత్‌- పాకిస్తాన్‌ దేశాల స్వాతంత్ర్య దినోత్సవాల సందర్బంగా వాఘా బోర్డర్‌ గుర్తుస్తోంది. ఓ వైపు పాకిస్తాన్‌తో వైరం..మరోవైపు చెలిమి దీనికి ప్రతీకగా నిలుస్తోంది ఈ వాఘా బోర్డర్‌. ఆగస్టు 14న పాక్‌ స్వాతంత్ర్య దినోత్సవమైతే..ఆ మరుసటి రోజున మనకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు. ఈ సందర్భంగా ఉభయ దేశాల సైనికులు నిర్వహించే బ్యాండ్‌ రీ ట్రీట్‌ గురించి చెప్పుకోవాలి.. వాఘా బోర్డర్‌..ఇది భారత్‌, పాకిస్తాన్‌ల నడుమ మిత్రత్వ వారధిగా చెప్పుకొవచ్చు. వాస్తవానికి ఇండియా – పాకిస్తాన్‌ దేశాలు […]

అటువైరం - ఇటు చెలిమి.. భారత్‌ - పాక్‌ మధ్య విచిత్ర బంధం !
Follow us on

భారత్‌- పాకిస్తాన్‌ దేశాల స్వాతంత్ర్య దినోత్సవాల సందర్బంగా వాఘా బోర్డర్‌ గుర్తుస్తోంది. ఓ వైపు పాకిస్తాన్‌తో వైరం..మరోవైపు చెలిమి దీనికి ప్రతీకగా నిలుస్తోంది ఈ వాఘా బోర్డర్‌. ఆగస్టు 14న పాక్‌ స్వాతంత్ర్య దినోత్సవమైతే..ఆ మరుసటి రోజున మనకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు. ఈ సందర్భంగా ఉభయ దేశాల సైనికులు నిర్వహించే బ్యాండ్‌ రీ ట్రీట్‌ గురించి చెప్పుకోవాలి..

వాఘా బోర్డర్‌..ఇది భారత్‌, పాకిస్తాన్‌ల నడుమ మిత్రత్వ వారధిగా చెప్పుకొవచ్చు. వాస్తవానికి ఇండియా – పాకిస్తాన్‌ దేశాలు స్నేహితులు కారు..నిజంగా చెప్పాలంటే..ముందునుండి బద్దశత్రువులు. ప్రతినిత్యము ఏదో ఒక రకంగా కత్తులు దూసుకునేంత శత్రుత్వం గల ఇరుగు పోరుగు దేశాలు. అయితే, ఆశ్చర్యం ఏమంటే..ఈ రెండు దేశాల మధ్య విభేదాలను పక్కనబెట్టి 1959లో కొద్ది సమయం మిత్రత్వం చేశాయి..అదే వాఘా బోర్డర్‌. నాటి నుండి నేటి వరకూ కూడా ఆ అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతూనే

ఉంది. అది వాఘా బోర్డర్‌ టూరిస్టులు ఆనందించే గొప్ప వేడుక. దేశ విభేదాలను పక్కన బెట్టి..ప్రతినిత్యం ఇక్కడ రెండు దేశాల సైనికులు చేసే మిత్రత్వాన్ని చూడాలంటే ఆ బోర్డర్‌కు వెళ్లాల్సిందే. ఇది అమృత్‌సర్‌కు కేవలం 30 కి.మీల దూరంలో ఉంది. ఈ సరిహద్దు ప్రదేశంలో ఇండియాలోని అమృత్‌సర్‌, పాకిస్తాన్‌లోని లహోర్‌లు వేరు చేయబడ్డాయి. ఇక ప్రతిరోజు జరిగే సైనికుల “బీటింగ్ రీట్రిట్‌’ వేడుకలు చూసేందుకు పర్యాటకులు సైతం భారీగా వస్తుంటారు.