ఇకపై పెట్రోల్‌ బంకుల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌లు

| Edited By:

Sep 07, 2020 | 10:47 AM

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని (ఈవీ) వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించే దిశగా దాదాపు 69,000 పెట్రోల్‌ బంకుల్లో కనీసం ఒక చార్జింగ్‌ కియోస్క్‌ అయినా ఏర్పాటు చేయాలన్న

ఇకపై పెట్రోల్‌ బంకుల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌లు
Follow us on

Electric Vehicle Charging: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని (ఈవీ) వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించే దిశగా దాదాపు 69,000 పెట్రోల్‌ బంకుల్లో కనీసం ఒక చార్జింగ్‌ కియోస్క్‌ అయినా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉంది. దీంతో పాటు ప్రభుత్వ రంగ రిఫైనర్లకు చెందిన బంకుల్లో(సీవోసీవో) ఈవీ చార్జింగ్‌ కియోస్క్‌ల ఏర్పాటును తప్పనిసరి చేయాలని భావిస్తోంది. ఈవీ చార్జింగ్‌ మౌలిక సదుపాయాలపై జరిగిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు చమురు శాఖ వర్గాలకు, కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ సూచనలు చేశారు.

చమురు మార్కెటింగ్‌ కంపెనీలు తమ నిర్వహణలోని అన్ని సీవోసీవో బంకుల్లో ఛార్జింగ్‌ కియోస్క్‌లను పెట్టే విధంగా చమురు శాఖ ఆదేశాలు జారీచేయొచ్చని ఆయన సూచించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అలాగే ఫ్రాంచైజీ ఆపరేటర్లు కూడా తమ బంకుల్లో కనీసం ఒక్కటైనా ఛార్జింగ్‌ కియోస్క్‌ పెట్టేలా ఆదేశాలను ఇస్తే మంచిదని మంత్రి చెప్పినట్లు తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా ఈవీ చార్జింగ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలన్న లక్ష్యం సాధ్యమవుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నగరాలు, జాతీయ రహదారుల్లో ఈవీ చార్జింగ్‌ ఇన్‌ఫ్రాను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించవచ్చని తెలిపాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, వడోదర, భోపాల్‌ వంటి నగరాలపై చమురు శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు పేర్కొన్నారు.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,802 కొత్త కేసులు.. 9 మరణాలు

కీర్తి ‘గుడ్‌లక్‌ సఖి’ షూటింగ్‌ పూర్తి