Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన 30 నిమిషాల్లోనే పాక్‌కు తెలియజేశాం: మంత్రి జైశంకర్‌

Operation Sindoor: ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన ఘటనకు ప్రతీకారంగా, భారత్‌ పాక్‌పై ఈ ఈ ప్రతీకారాన్ని తీర్చుకుంది. ముఖ్యంగా పర్యాటకుల కోసం, సరిహద్దు వెంబడి తొమ్మిది ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని మే 7న..

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన 30 నిమిషాల్లోనే పాక్‌కు తెలియజేశాం: మంత్రి జైశంకర్‌

Updated on: May 26, 2025 | 6:29 PM

ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన 30 నిమిషాల్లోనే భారతదేశం పాకిస్తాన్‌కు సమాచారం అందించిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీకి తెలిపారు. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారతదేశం వైమానిక దాడులు నిర్వహించి, పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్ సింధూర్ మే 7 రాత్రి ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన అరగంటలోపు ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నట్లు పాకిస్తాన్‌కు తెలిపినట్లు విదేశాంగ మంత్రి చెప్పినట్లు వర్గాలు తెలిపాయి.

పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో జరిగిన చర్చ:

విదేశీ వ్యవహారాలపై పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశం ఎస్. జైశంకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆపరేషన్ సింధూర్‌, సీమాంతర ఉగ్రవాదం గురించి చర్చించారు. కెసి వేణుగోపాల్, మనీష్ తివారీ, ముకుల్ వాస్నిక్, ప్రియాంక చతుర్వేది, అపరాజిత సారంగి, గుర్జీత్ సింగ్ ఔజ్లా సహా పలువురు ఎంపీలు ఇందులో పాల్గొన్నారు.

ఇస్లామాబాద్ చొరవతో భారతదేశం-పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOలు) ప్రత్యక్ష సంభాషణ జరిపిన తర్వాత, ఉద్రిక్తతలు పెరగకుండా ఉండటానికి ఈ విషయంపై పాకిస్తాన్‌తో వివరించిన తర్వాత రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని భారతదేశం ఖచ్చితత్వంతో వ్యవహరించిందని, ఉద్రిక్తతలు పెరగకుండా ఉండటానికి పాకిస్తాన్‌కు వెంటనే ఈ విషయాన్ని తెలియజేశామని జైశంకర్ సభ్యులకు వివరించినట్లు  సమావేశంలో పాల్గొన్న వర్గాలు తెలిపాయి.

భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణపై అమెరికా వాదనకు సంబంధించి, విదేశాంగ మంత్రి మాట్లాడుతూ.. భారతదేశం వైఖరిని తెలియజేశామని, వాళ్ళు కాల్చారు, మనం కాల్చాము. వాళ్ళు ఆగిపోతే, మనం కూడా ఆగిపోతాం.. పాకిస్తాన్ పెద్ద ఎత్తున ప్రతీకారం తీర్చుకోవచ్చని అమెరికా విదేశాంగ కార్యదర్శి నిఘా సమాచారం ఇచ్చినప్పుడు పాకిస్తాన్ దాడిని పెంచితే, తాము కూడా అదే విధంగా స్పందించడానికి సిద్ధంగా ఉన్నామని భారతదేశం గట్టిగా స్పందించిందని ఎస్ జైశంకర్ అన్నారు.

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన ఘటనకు ప్రతీకారంగా, భారత్‌ పాక్‌పై ఈ ప్రతీకారాన్ని తీర్చుకుంది. ముఖ్యంగా పర్యాటకుల కోసం సరిహద్దు వెంబడి తొమ్మిది ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని మే 7న తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్‌ దాడులను ప్రారంభించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us