Delhi Lockdown: దేశ రాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్ గడువు పెంపు.. సంచలన ప్రకటన చేసిన సీఎం కేజ్రీవాల్

|

Apr 25, 2021 | 12:40 PM

Lockdown extended in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో కరోనాకేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో

Delhi Lockdown: దేశ రాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్ గడువు పెంపు.. సంచలన ప్రకటన చేసిన సీఎం కేజ్రీవాల్
Arvind Kejriwal
Follow us on

Lockdown extended in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో కరోనాకేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం వారం నుంచి లాక్‌డౌన్‌ను విధించి చర్యలు తీసుకుంటోంది. కాగా ఈ లాక్‌డౌన్ రేపు ఉదయంతో ముగియనుండటంతో కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిలో మరో వారంపాటు లాక్‌డౌన్‌ గడువును పెంచనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. వచ్చే సోమవారం వరకు లాక్‌డౌన్‌ను పెంచనున్నట్లు కేజ్రీవాల్ ఆదివారం వెల్లడించారు.

అంతకుముందు ఆరు రోజుల లాక్‌డౌన్ మాత్రమే విధించామని.. కేసులు పెరుగుతున్న దృష్ట్యా గడువును పొడిగిస్తున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత వేధిస్తున్న నేపథ్యంలో.. సరఫరా కోసం.. తయారీదారులు, సరఫరాదారులు, ఆసుపత్రులతో నిరంతరం సంప్రదిస్తున్నామని తెలిపారు. రెండు గంటలకొకసారి సమాచారం తెలిసేలా.. పోర్టల్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర అధికార బృందాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులతోపాటు.. మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో నాలుగురోజుల నుంచి విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా రోగులతో ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. ఈ క్రమంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆక్సిజన్ అందకపోవడంతో… మూడు రోజుల నుంచి దాదాపు 50 మంది రోగులు మరణించారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై.. ఆసుపత్రులకు ఆక్సిజన్‌ను సమకూరుస్తున్నాయి.

Also Read:

Medical Oxygen: ఢిల్లీలో ప్రాణ వాయువు కోసం ఎదురుచూపులు.. మరోసారి సర్ గంగారామ్‌ హాస్పిటల్‌లో తగ్గిన ఆక్సిజన్‌ నిల్వలు

COVID-19 Care: కరోనా విజృంభణ.. ఐసోలేషన్ కేంద్రాలుగా రైల్వే కోచ్‌లు.. మోహరిస్తున్న రైల్వేశాఖ