
తమిళనాడులో 35 ఏళ్ళ అన్నా డీఎంకే ఎమ్మెల్యే ఎ. ప్రభు, 19 ఏళ్ళ సౌందర్య వివాహానికి మద్రాస్ హైకోర్టు శుభం కార్డు వేసింది. ట్విస్ట్ ఏమిటంటే శుక్రవారం కోర్టులో సౌందర్య.. తన ఇష్ట ప్రకారమే ప్రభును పెళ్లి చేసుకున్నానని, పరస్పరం ఇష్టపడ్డాం కనుకే ఈ వెడ్డింగ్ జరిగిందని స్పష్టం చేసింది. ఇందులో అసలు కిడ్నాప్ ప్రసక్తే లేదని కూడా వెల్లడించింది. దీంతో ఆమె తండ్రి స్వామినాథన్ నోటమాటరాక,, తెల్లబోతుండగా..కోర్టు ఆయన దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ ని కొట్టివేసింది. అలాంటప్పుడు ఇందులో ఇష్యు ఏముందని న్యాయమూర్తి ప్రశ్నించారు కూడా. మొత్తానికి ఇవాళ కోర్టులో ఓ గంటన్నర సేపు హైడ్రామా నెలకొనడమే కొసమెరుపు.